Sunday, July 26, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshTholi Ekadashi | తొలి ఏకాదశి విశిష్టత ఏంటి? ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్య రహస్యం ఇదే!

Tholi Ekadashi | తొలి ఏకాదశి విశిష్టత ఏంటి? ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్య రహస్యం ఇదే!

-

Chat on WhatsApp

Tholi Ekadashi: ఆషాఢ శుద్ధ ఏకాదశిని హిందువులు అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. దీనినే తొలి ఏకాదశి లేదా శయని ఏకాదశిగా పిలుస్తారు. ఈ పర్వదినంతో తెలుగు ప్రజలకు పండుగల కాలం ప్రారంభమవుతుందని విశ్వాసం. పురాణాల ప్రకారం ఈ రోజున శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై యోగనిద్రలోకి వెళ్తాడని, అనంతరం కార్తీక శుద్ధ ఏకాదశినాడు మేల్కొంటాడని చెబుతారు. ఈ మధ్యకాలాన్నే చాతుర్మాసం అంటారు. ఈ నాలుగు నెలల్లో భక్తులు ఉపవాసాలు, జపాలు, ధ్యానాలు, విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమవుతారు.

తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తికి జొన్న పేలాలు, బెల్లం, యాలకులు, మిరియాలతో తయారు చేసిన ‘పేలాల పిండి’ని నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీ. ఈ ప్రసాదానికి ఆరోగ్యపరమైన ప్రాధాన్యం కూడా ఉంది. వర్షాకాలంలో రోగనిరోధక శక్తి తగ్గే సమయంలో జొన్నలు జీర్ణక్రియకు తోడ్పడగా, బెల్లం శక్తిని అందిస్తుంది. మిరియాలు శరీరాన్ని వెచ్చగా ఉంచి జలుబు, కఫం వంటి సమస్యల నుంచి రక్షణ కల్పిస్తాయి.

గ్రామీణ ప్రాంతాల్లో తొలి ఏకాదశిని రైతులు వ్యవసాయ పనుల ప్రారంభానికి శుభదినంగా భావించి భూమాతకు, శ్రీమహావిష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మంచి వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ప్రార్థిస్తూ ఏరువాకకు శ్రీకారం చుడతారు. ఆధ్యాత్మికత, ఆరోగ్యం, ప్రకృతి పట్ల కృతజ్ఞతను కలగలిపిన పర్వదినమే తొలి ఏకాదశి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp