Central Government: విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. విద్యార్థి సమస్యలపై సీజేపీ (CJP) నిర్వహిస్తున్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర మంత్రులు, సీజేపీ ప్రతినిధుల మధ్య ఢిల్లీలో కీలక సమావేశం జరిగింది. కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరిగిన ఈ భేటీలో విద్యార్థుల భవిష్యత్తు, పరీక్షల నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులు, విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సమావేశానికి కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. సీజేపీ తరఫున సౌరవ్ దాస్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం పాల్గొని విద్యార్థుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. ముఖ్యంగా పరీక్షల పారదర్శకత, పేపర్ లీకేజీలు, విద్యార్థులకు నష్టం కలిగించే అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
ఇదే సమయంలో కేంద్ర కేబినెట్ సమావేశం కూడా నిర్వహించింది. పరీక్షల వ్యవస్థలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. పేపర్ లీకేజీలపై మరింత కఠిన నిబంధనలు తీసుకురావడంతో పాటు, ప్రత్యేక చట్టం తీసుకొచ్చే అంశాన్ని కూడా కేంద్రం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. విద్యార్థుల నమ్మకాన్ని పునరుద్ధరించడం, పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచడం లక్ష్యంగా కేంద్రం చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ALSO READ: Abhijit Dipke | రాజీనామా చేయాల్సిందే.. ధర్మేంద్ర ప్రధాన్పై సీజేపీ ఒత్తిడి








