Nara Lokesh: అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి చేసిన మంగళగిరి రైల్వే స్టేషన్ పునఃప్రారంభ కార్యక్రమంలో మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. కార్యక్రమం సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శన కోసం సిద్ధమవుతున్న ఓ చిన్నారి తన మొబైల్తో సెల్ఫీ తీసుకుంటుండగా, అది గమనించిన లోకేశ్ సరదాగా ఆమె పక్కకు వెళ్లి కెమెరాకు పోజిచ్చారు.
ఊహించని విధంగా మంత్రి తన సెల్ఫీలో కనిపించడంతో ఆ చిన్నారి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది. అనంతరం ఫొటో చూసుకుని ఆనందంతో చిరునవ్వులు చిందించింది. అక్కడ ఉన్నవారు కూడా ఈ ఆప్యాయ క్షణాన్ని ఆసక్తిగా వీక్షించారు. చిన్నారులతో లోకేశ్ మమేకమైన తీరు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ మధుర సంఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.








