India-Sweden: భారత్–స్వీడన్ సంబంధాలు మరో కొత్త మైలురాయిని చేరుకున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ స్వీడన్ పర్యటన విజయవంతంగా ముగియడంతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధాలు మరింత బలపడ్డాయి. ఈ పర్యటనలో పలు కీలక ఒప్పందాలు, కొత్త సహకార కార్యక్రమాలు ప్రారంభం కావడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు “వ్యూహాత్మక భాగస్వామ్యం” స్థాయికి చేరాయి.
ప్రధాని మోడీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా ఈ పర్యటన ఫలప్రదంగా సాగిందని తెలిపారు. భారత్–స్వీడన్ మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి “జాయింట్ ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్ 2.0”ను ప్రారంభించడం ఒక కీలక ముందడుగుగా నిలిచింది.
శాస్త్ర సాంకేతిక రంగాల్లో సహకారాన్ని పెంపొందించేందుకు ప్రత్యేకంగా ఇండియా–స్వీడన్ టెక్నాలజీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారిడార్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇది భవిష్యత్తులో AI, డిజిటల్ ఇన్నోవేషన్ రంగాల్లో కొత్త అవకాశాలను తెరవనుంది.
ఇక వాణిజ్య రంగంలో కూడా ఇరు దేశాలు వచ్చే ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.
స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టెర్సన్తో జరిగిన చర్చలు అత్యంత ఫలప్రదంగా సాగాయని ప్రధాని మోడీ పేర్కొన్నారు. స్వీడన్ ప్రభుత్వం, ప్రజలు చూపిన ఆతిథ్యానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ALSO READ:KBR Park | చెట్ల నరికివేతపై సుప్రీం స్టే… కేబీఆర్ పార్క్ కేసులో కీలక ఆదేశాలు








