Saturday, July 11, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshGoods Train | నెల్లూరు జిల్లాలో రైలు ప్రమాదం.. తిరుపతి మార్గంలో అంతరాయం

Goods Train | నెల్లూరు జిల్లాలో రైలు ప్రమాదం.. తిరుపతి మార్గంలో అంతరాయం

-

Chat on WhatsApp

Goods Train: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పిన ఘటన కలకలం రేపింది. వెంకటాచలం-మనుబోలు రైల్వే మార్గంలోని కొమ్మలపూడి జంక్షన్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

విజయవాడ నుంచి తిరుపతి వైపు వెళ్తున్న గూడ్స్ రైలు అకస్మాత్తుగా పట్టాలు తప్పడంతో రైల్వే అధికారుల్లో ఆందోళన నెలకొంది.

రైలుకు అనుసంధానంగా ఉన్న పాల ట్యాంకర్ బోగీ ట్రాక్‌పై అడ్డంగా పడిపోవడంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనతో పలు రైళ్లు ఆలస్యంగా నడిచే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే సిబ్బంది, సాంకేతిక బృందాలు అక్కడికి చేరుకుని పునరుద్ధరణ పనులు ప్రారంభించాయి.

ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియలేదు. ట్రాక్‌లో సాంకేతిక లోపమా, లేక బోగీ సమస్యా అన్న దానిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ప్రాథమిక సమాచారం. మార్గాన్ని త్వరగా పునరుద్ధరించేందుకు రైల్వే శాఖ చర్యలు చేపట్టింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

telangana chief minister revanth reddy predicts 2029 assembly elections

CM Revanth Reddy | వచ్చే ఎన్నికల్లో 182 అసెంబ్లీ స్థానాల్లో 117 కాంగ్రెస్‌వే.....

CM Revanth Reddy: ఖమ్మం జిల్లాలో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల షెడ్యూల్, కాంగ్రెస్ భవిష్యత్తు, బీఆర్‌ఎస్‌పై తన రాజకీయ అంచనాలను వెల్లడించారు. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన...
- Advertisement -
Chat on WhatsApp