Gold Rates Today: బంగారం ప్రియులకు మళ్లీ షాక్ తగిలింది. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి ఎగబాకాయి. క్రిస్మస్కు ముందైనా తగ్గుతాయేమోనని భావించిన వినియోగదారులకు తాజా రేట్లు నిరాశ కలిగించాయి.
బంగారం ధరలు తరచూ మారుతున్న నేపథ్యంలో, సోమవారం కూడా తులం పసిడిపై ₹270 పెరుగుదల నమోదైంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,30,420 వద్ద ట్రేడ్ అవుతోంది.
ALSO READ:పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ ఉండవల్లి అరుణ్ కుమార్
ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై ₹250 పెరిగి ₹1,19,550 వద్ద అమ్ముడవుతోంది. అదే విధంగా 18 క్యారెట్ల ధరలు కూడా ప్రభావితమై ₹210 పెరిగి ₹97,820 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
పసిడి కొనుగోలుదారులను నిరాశపర్చిన ఈ పెరుగుదల, మార్కెట్లో మరోసారి ప్రీమియం కొనుగోళ్లు జరిగే సూచనలను చూపిస్తోంది.
అయితే వెండి ధర మాత్రం వినియోగదారులకు ఉపశమనం అందించింది. కిలో వెండిపై ₹1,000 తగ్గి ₹1,89,000 వద్ద ట్రేడ్ అవుతోంది. చెన్నై, హైదరాబాద్ నగరాల్లో కిలో వెండి ₹1,98,000 వద్ద, ఢిల్లీ, ముంబై, కోల్కతాలో ₹1,89,000 వద్ద అమ్ముడవుతోంది.
బులియన్ మార్కెట్లో తిరిగి ధరల హెచ్చుతగ్గులు కొనసాగే అవకాశం ఉండగా, కొనుగోలుదారులు తాజా రేట్లపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది.
