Thursday, March 12, 2026
No menu items!
Home Andhra Pradesh అభివృద్ధి చేసింది ఎవరు? కూటమి ప్రభుత్వం పై ఫైర్ యాంకర్ శ్యామల

అభివృద్ధి చేసింది ఎవరు? కూటమి ప్రభుత్వం పై ఫైర్ యాంకర్ శ్యామల

0
13
Anchor Shyamala criticizes Andhra Pradesh coalition government
Anchor Shyamala criticizes Andhra Pradesh coalition government

కూటమి ప్రభుత్వంపై మండిపడ్డ  వైసీపీ(Ysrcp) రాష్ట్ర అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల ఘాటైన విమర్శలు చేశారు. విశాఖ అభివృద్ధి, విద్యారంగ ప్రగతి, వైద్య సేవల విస్తరణ విషయాల్లో జగన్ హయాంలో తీసుకున్న చర్యలను గుర్తుచేశారు. బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్‌తో పోటీపడే నగరంగా విశాఖను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో జగన్ మోహన్ రెడ్డి పనిచేశారని శ్యామల పేర్కొన్నారు.

ALSO READ:Visakhapatnam Illegal Beef Case: అక్రమ గోమాంసంపై పవన్ కల్యాణ్ ఆగ్రహం

పేద మరియు మధ్యతరగతి ప్రజలకు విద్య, వైద్యం అందుబాటులో ఉండేలా విప్లవాత్మక మార్పులు చేపట్టారని ఆమె తెలిపింది. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ రంగాలను ప్రజలకు దూరం చేస్తోందని విమర్శించారు.

ఒకవైపు కల్తీ మద్యం విక్రయాలు పెరుగుతున్నాయని, మరోవైపు విశాఖ బీచ్‌ను గోవా తరహాలో మార్చే వ్యాఖ్యలు చేయడం బాధాకరమని శ్యామల అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది ఎవరు, అధోగతి పాలుచేస్తున్నది ఎవరు అన్నది ప్రజలు గమనించాలని ఆమె సోషల్ మీడియాలో పేర్కొన్నారు.