Sunday, July 5, 2026
Chat on WhatsApp
HomeInterNationalపహల్గామ్ దాడి అనంతరం పాక్ వీసాలు రద్దు

పహల్గామ్ దాడి అనంతరం పాక్ వీసాలు రద్దు

-

Chat on WhatsApp

పహల్గామ్ దాడి ఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో ఉన్న పాకిస్థాన్ పౌరులకు జారీ చేసిన దాదాపు అన్ని రకాల వీసాలను రద్దు చేసింది. 72 గంటల్లోగా వారు స్వదేశానికి వెళ్లిపోవాలని ఆదేశిస్తూ గడువును విధించింది. సాధారణ వీసాల గడువు ఆదివారంతో ముగియగా, వైద్య వీసాల గడువును మంగళవారం వరకు పొడిగించారు.

ఈ చర్యల నేపథ్యంలో, వీసా గడువు పూర్తయిన తరువాత కూడా దేశం విడిచి వెళ్లని పాక్ పౌరులపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఇమిగ్రేషన్ చట్టం ప్రకారం, విదేశీయులు గడువు మించి దేశంలో ఉంటే మూడేళ్ల జైలు శిక్ష లేదా రూ.3 లక్షల జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. అధికారులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సిఫార్సుల మేరకు వీసా సేవలను తక్షణమే నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 27, 2025 నుంచి పలు వీసాల రద్దు అమలులోకి రాగా, వైద్య వీసాలకు ఏప్రిల్ 29 వరకు గడువు ఇచ్చారు. సుమారు 12 రకాల వీసాలు కలిగిన పాకిస్థాన్ పౌరులు ఆదివారంలోపు దేశం విడిచి వెళ్లాలని సూచించారు.

గత మూడు రోజులుగా అట్టారీ-వాఘా సరిహద్దు వద్ద భారీగా ప్రజల తరలింపు చోటుచేసుకుంది. శుక్రవారం నుంచి 509 మంది పాక్ పౌరులు భారత్ విడిచి వెళ్లగా, అదే సమయంలో పాకిస్థాన్‌లో ఉన్న 745 మంది భారతీయులు కూడా తమ స్వదేశానికి తిరిగి వచ్చారు. వీరిలో దౌత్యవేత్తలు, అధికారులు కూడా ఉన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

viral controversial book cover seen in hyderabad metro sparks social media debate

Social Media | మెట్రోలో వైరల్ బుక్ కవర్.. ‘భార్యను బొందపెట్టడం ఎలా?’ ఫొటోపై...

Social Media: సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఫొటోలు, వీడియోలు తరచూ కొత్త చర్చలకు తెరలేపుతుంటాయి. తాజాగా మెట్రో రైళ్లలో ప్రయాణికులు చదువుతున్నట్లు కనిపించిన రెండు పుస్తకాల కవర్లు నెట్టింట హాట్ టాపిక్‌గా...
- Advertisement -
Chat on WhatsApp