Tuesday, April 7, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshజలశక్తి మంత్రితో సీఎం చంద్రబాబు కీలక భేటీ

జలశక్తి మంత్రితో సీఎం చంద్రబాబు కీలక భేటీ

-

Chat on WhatsApp

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు న్యూఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖామంత్రి సీ.ఆర్. పాటిల్ గారిని కలిసి సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక జల ప్రాజెక్టుల అభివృద్ధి, నిధుల మంజూరులపై ముఖ్యంగా చర్చ జరిపారు. ఈ భేటీతో రాష్ట్రానికి జలవనరుల అభివృద్ధిలో ఒక కీలక ముందడుగు పడిందని భావిస్తున్నారు.

ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు కిన్జర్ రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ గారులు కూడా పాల్గొన్నారు. రాష్ట్రానికి అవసరమైన నీటి ప్రాజెక్టుల వివరాలను సమగ్రంగా కేంద్రానికి వివరించిన సీఎం, వాటికి తక్షణమే ఆమోదం మరియు నిధుల విడుదల చేయాలని అభ్యర్థించారు.

విభజన అనంతరం నిలిచిపోయిన లేదా ఆలస్యం అయిన ప్రాజెక్టుల పునఃప్రారంభంపై కూడా ముఖ్యమంత్రి స్పష్టమైన విధానాన్ని కేంద్రానికి వివరించారు. రాష్ట్రానికి నీటి అవసరాల దృష్ట్యా ఎటువంటి రాజకీయం లేకుండా కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

సమావేశంలో ఎంపీలు, సంబంధిత శాఖల అధికారులు కూడా పాల్గొన్నారు. జల శక్తి మంత్రిత్వ శాఖ ద్వారా అందే ప్రాజెక్టుల నిధులు, విధానాల అమలుపై స్పష్టత కలిగేలా ఈ భేటీ జరిగింది. రాష్ట్రాభివృద్ధి దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని సీఎం చంద్రబాబు అన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

rajnath singh warning pakistan over bengal and kolkata threat

Rajnath Singh | 1971 యుద్ధాన్ని గుర్తు చేసిన రాజ్‌నాథ్…వార్నింగ్ ఇస్తూ…చరిత్ర రిపీట్ అవుద్ది

Rajnath Singh: పాకిస్థాన్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ కోల్‌కతాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై భారత రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. “బెంగాల్‌పై కన్నేస్తే, ఈసారి పాకిస్థాన్ ఎన్ని ముక్కలవుతుందో...
- Advertisement -
Chat on WhatsApp