Friday, July 10, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshనెల్లూరులో మంత్రి నారాయణ పాఠశాలలో మాస్టర్‌గా మారి బోధన

నెల్లూరులో మంత్రి నారాయణ పాఠశాలలో మాస్టర్‌గా మారి బోధన

-

Chat on WhatsApp

నెల్లూరు నగరంలో రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సోమవారం సుడిగాలి పర్యటన నిర్వహించారు. తన పర్యటనలో భాగంగా 52వ డివిజన్ గొల్లవీధిలోని ఉర్దూ పాఠశాలను సందర్శించారు. అక్కడి పరిస్థితులను సమీక్షించడమే కాకుండా, విద్యార్థులతో చర్చిస్తూ విద్యపై అవగాహన పెంచేలా మాట్లాడారు.

పాఠశాలలో పాఠాలు చెప్పే అవకాశం రావడంతో పాత రోజులను గుర్తు చేసుకున్న మంత్రి, తాను విద్యారంగంలో గడిపిన అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. మాస్టర్‌గా మారిన నారాయణ, పిల్లలతో పాఠాలు చదివించారు. ప్రత్యేకంగా ఇంగ్లీషు పఠనాన్ని పరీక్షించి, బాగా చదవగలిగిన విద్యార్థులను “గుడ్ గుడ్” అంటూ అభినందించారు.

విద్యను అందరికీ సమానంగా అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అనేక విద్యా విధానాలు, సంస్కరణలు తీసుకువస్తోందని మంత్రి తెలిపారు. విద్యార్థులకు మరింత మెరుగైన వసతులు అందించేందుకు సర్కారు కృషి చేస్తోందని హామీ ఇచ్చారు. పాఠశాల అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఈ పర్యటనలో ప్రాంతీయ ప్రజాప్రతినిధులు, అధికారులు, టీచర్లు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మంత్రి నారాయణ సందర్శనంపై హర్షం వ్యక్తం చేశారు. విద్యపై మంత్రికి ఉన్న అభిరుచి, విద్యార్థుల పట్ల చూపిన ఉత్సాహం అందరినీ ఆకట్టుకుంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

CM Revanth Reddy | ‘తాత.. నువ్వే పూరీలు వేయాలి’.. మనవడి కోరిక తీర్చిన...

CM Revanth Reddy: రాష్ట్ర పాలనలో నిత్యం బిజీగా ఉండే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈసారి కుటుంబంతో గడిపిన ఓ అపురూపమైన క్షణాన్ని ప్రజలతో పంచుకున్నారు. అధికారిక కార్యక్రమాలకు భిన్నంగా ఆయన...
- Advertisement -
Chat on WhatsApp