Friday, July 10, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshఎమ్మిగనూరులో రంజాన్ ఏర్పాట్లపై ఎమ్మెల్యే సమీక్ష

ఎమ్మిగనూరులో రంజాన్ ఏర్పాట్లపై ఎమ్మెల్యే సమీక్ష

-

Chat on WhatsApp

త్వరలో రంజాన్ మాసం ప్రారంభం కానుండటంతో ఎమ్మిగనూరు పట్టణంలో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి మసీదు పెద్దలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రంజాన్ ఉపవాస సమయంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మసీదుల వద్ద నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో మసీదు పెద్దలు ప్రధానంగా నీటి సమస్య, ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని షెడ్డుల నిర్మాణం, మసీదుల పరిశుభ్రత, తగిన సంఖ్యలో విద్యుత్ దీపాల ఏర్పాటు, పోలీసుల బందోబస్తు వంటి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. రంజాన్ మాసం ప్రారంభం కాకముందే ఈ పనులను పూర్తిచేయాలని అధికారులకు ఆయన స్పష్టం చేశారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఉపవాస దినాల్లో ముస్లిం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అన్నారు. ప్రత్యేకంగా వాటర్ ట్యాంకర్లు ఏర్పాటు చేసి తాగునీటి సమస్యను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. మసీదుల వద్ద రోజువారీ పరిశుభ్రత చేపట్టాలని, ప్రజలకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఈ సమీక్షా సమావేశంలో మసీదు పెద్దలు, మున్సిపల్ అధికారులు, పోలీసులు పాల్గొన్నారు. అధికారులు రంజాన్ మాసానికి ముందు పనులను పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి, ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

CM Revanth Reddy | ‘తాత.. నువ్వే పూరీలు వేయాలి’.. మనవడి కోరిక తీర్చిన...

CM Revanth Reddy: రాష్ట్ర పాలనలో నిత్యం బిజీగా ఉండే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈసారి కుటుంబంతో గడిపిన ఓ అపురూపమైన క్షణాన్ని ప్రజలతో పంచుకున్నారు. అధికారిక కార్యక్రమాలకు భిన్నంగా ఆయన...
- Advertisement -
Chat on WhatsApp