Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshదేవిబెట్ట శ్రీ రంగస్వామి మహా రథోత్సవం వైభవంగా నిర్వహణ

దేవిబెట్ట శ్రీ రంగస్వామి మహా రథోత్సవం వైభవంగా నిర్వహణ

-

Chat on WhatsApp

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని దేవిబెట్ట గ్రామంలో శ్రీ శ్రీ రంగస్వామి మహా రథోత్సవం శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా వేద పండితులు వేద మంత్రాలతో హోమం నిర్వహించగా, గ్రామస్తుడు రెడ్డిమాను బలరాముడు భాజా భజంత్రీలతో మహా రథోత్సవాన్ని ముందుకు తీసుకు వచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.

అనంతరం శ్రీ శ్రీ రంగస్వామి ఆలయం నుండి ఆలయ అర్చకులు ఉత్సవమూర్తిని భక్తుల నడుమ రథం వద్దకు తీసుకెళ్లారు. నందికొళ్ళు, భజంత్రీలతో శోభాయమానంగా సాగిన రథోత్సవం భక్తులకు కనువిందు చేసింది. హోరోహర నినాదాలతో భక్తులు ఉత్సాహంగా పాల్గొని తమ భక్తిభావాన్ని వ్యక్తపరిచారు.

మహా రథోత్సవం సందర్భంగా గ్రామంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో గ్రామీణ సీఐ మధుసూదన్ రావు, ఎస్‌ఐ శ్రీనివాసులు తమ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి, శాంతియుతంగా ఉత్సవాన్ని కొనసాగించారు. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంకట్రామి రెడ్డి, టీడీపీ మండల నాయకులు దేవిబెట్ట సోమేశ్వర్ రెడ్డి, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉత్సవం విజయం సాధించేందుకు గ్రామస్తుల సహకారం ముఖ్యంగా నిలిచింది. భక్తిభావంతో నిర్వహించిన మహా రథోత్సవం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

assam rifles convoy attacked by militants in manipur ukhrul district

Assam | మణిపూర్‌లో మిలిటెంట్ల దాడి.. అమరులైన ఇద్దరు అస్సాం రైఫిల్స్ జవాన్లు

Assam: మణిపూర్‌లో మరోసారి హింసాత్మక ఘటన చోటుచేసుకోవడంతో భద్రతా పరిస్థితులపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఉఖ్రుల్ జిల్లాలో అస్సాం రైఫిల్స్‌కు చెందిన కాన్వాయ్‌పై మిలిటెంట్లు జరిపిన ఆకస్మిక దాడిలో ఇద్దరు జవాన్లు విధి నిర్వహణలో...
- Advertisement -
Chat on WhatsApp