Thursday, July 9, 2026
Chat on WhatsApp
HomeKURNOOLAdoniజగనన్న కాలనీలో అక్రమ బోరు వాడకం

జగనన్న కాలనీలో అక్రమ బోరు వాడకం

-

Chat on WhatsApp

ఆదోని మండలం పరిధిలోని పెద్ద తుంబలం గ్రామంలో జగనన్న కాలనీలో కొన్ని ప్రైవేటు వ్యక్తులు అక్రమంగా బోరు నీటిని వినియోగిస్తున్నారు. ఈ బోరు నీటిని ఇళ్ల నిర్మాణం కోసం ఉపయోగించుకుంటున్నారు. ప్రభుత్వం బోర్లు, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి కోటి రూపాయల ఖర్చు పెట్టి ప్రజల నిత్యావసరాల కోసం ఏర్పాటు చేసిన వాటిని, కొందరు స్వార్థంగా వాడుకుంటున్నారు.

ఈ విషయంపై గ్రామస్తులు నిరసన వ్యక్తం చేస్తూ, అధికారులు స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్ కూడా ఈ అక్రమ కార్యకలాపాలు చూస్తూ నోచుకుంటున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ వనరులను వృథా చేయడం పట్ల వారి అసంతృప్తి మరింత పెరిగింది.

ఈ పరిస్థితిని గుర్తించిన అధికారులు వివరణ అడిగినప్పటికీ, ఫోన్ ద్వారా వారి వద్ద సరిగా స్పందన రాలేదు. గ్రామస్తులు ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంపై తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. వారు ప్రభుత్వ వనరులను సక్రమంగా ఉపయోగించుకోవాలని, అక్రమంగా వాటిని దోచుకోవడాన్ని అరికట్టాలని కోరుతున్నారు.

ఇతర గ్రామాల్లో కూడా ఇలాంటి అక్రమ వినియోగం కొనసాగుతుందని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని అధికారులు మరింత సీరియస్‌గా తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

destruction footage of ali khamenei residence after us israel airstrikes

Iran | ఖమేనీ నివాసంపై దాడి విధ్వంసం.. తొలిసారి బయటకు వచ్చిన వీడియో

అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల అనంతరం ఇరాన్(Iran) మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ నివాస సముదాయానికి జరిగిన నష్టానికి సంబంధించిన వీడియోను ఇరాన్ ప్రభుత్వ మీడియా తొలిసారిగా బహిర్గతం చేసింది....
- Advertisement -
Chat on WhatsApp