Thursday, July 9, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshఎమ్మిగనూరు మున్సిపల్ కౌన్సిల్‌ సమావేశంలో వాగ్వివాదం

ఎమ్మిగనూరు మున్సిపల్ కౌన్సిల్‌ సమావేశంలో వాగ్వివాదం

-

Chat on WhatsApp

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం మంగళవారం చైర్మన్ కేఎస్ రఘు అధ్యక్షతన ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలు సమస్యలపై చర్చ జరగాల్సి ఉండగా, ప్రారంభమైన కొద్దిసేపటికే అధికార పార్టీ మరియు ప్రతిపక్షం మధ్య వాగ్వాదం మొదలైంది.

ఎమ్మిగనూరు పట్టణంలో అభివృద్ధి పనుల గురించి చర్చ సందర్భంగా అధికార పార్టీ వారు “మేము చేశాం” అని, ప్రతిపక్షం “మేము నిధులు ఇచ్చాము” అంటూ పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఈ వాగ్వాదం వల్ల సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.

సభాపతి కేఎస్ రఘు వివాదం సద్దుమణిగే ప్రయత్నం చేసినా, రెండు పార్టీల సభ్యులు తమ అభిప్రాయాలను కొనసాగిస్తూ గట్టిగా వాదించారు. చివరకు, పరిస్థితి అదుపు తప్పడంతో చైర్మన్ గారే సభను ఆపేందుకు బెల్ మోగించారు.

సభ కొనసాగించలేని పరిస్థితుల్లో చైర్మన్ కేఎస్ రఘు వాకౌట్ చేశారు. ఈ ఘటన స్థానిక రాజకీయాలపై ప్రజల దృష్టిని మరల్చింది. అభివృద్ధి అంశాలపై ఇలాంటి వివాదాలు పట్టణ ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

The Tatas Web Series | వ్యాపార దిగ్గజం టాటా కుటుంబ చరిత్రతో కొత్త...

The Tatas Web Series: భారత పారిశ్రామిక చరిత్రలో చెరగని ముద్ర వేసిన టాటా కుటుంబం జీవిత ప్రయాణం త్వరలో వెబ్ సిరీస్ రూపంలో ప్రేక్షకులను అలరించనుంది. దేశ నిర్మాణంలో కీలక పాత్ర...
- Advertisement -
Chat on WhatsApp