Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshవైసీపీ నుండి జనసేనలోకి 9 కార్పొరేటర్లు చేరిక

వైసీపీ నుండి జనసేనలోకి 9 కార్పొరేటర్లు చేరిక

-

Chat on WhatsApp

విజయనగరం టౌన్ వైసీపీ నాయకులు పు విక్రమ్ తన భార్య భావనతో కలిసి జనసేనలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు.

విక్రమ్ మాట్లాడుతూ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్ వెనకాల నడిచానని, వైసీపీకి మొదటిసారిగా విజయనగరంలో జండా ఎగరవేశానని అన్నారు.

వైసీపీ ప్రభుత్వం వచ్చాక తనకు, కార్యకర్తలకు ఏ విలువ కూడా ఇవ్వలేదని, వారికి సహకరించిన వాళ్లను వైసీపీ వారే దాడి చేయడంతో తీవ్ర నిరాశకు గురైనట్లు తెలిపారు.

పవన్ కళ్యాణ్ ఆశయాలు, కూటమి ప్రభుత్వంలో జనసేన విధానాలు నచ్చడంతో, కార్యకర్తలతో కలిసి జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నామన్నారు.

ఈ నెల 22న మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో 9 మంది కార్పొరేటర్లు జనసేనలో చేరబోతున్నట్లు విక్రమ్ ప్రకటించారు.

పవన్ కళ్యాణ్ నాయకత్వంపై నమ్మకంతో, వైసీపీకి సేవలు చేసినా గుర్తింపు రాకపోవడం వల్ల పార్టీ మారాల్సి వచ్చినట్లు వివరించారు.

రాజకీయ భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ నాయకత్వం దేశంలో మార్పు తీసుకొస్తుందనే నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకున్నామని విక్రమ్ చెప్పారు.

ఈ మార్పు విజయనగరంలో జనసేనకు బలమైన సపోర్ట్ ఇస్తుందని, ప్రజల కోసం పని చేయడమే తమ ప్రధాన లక్ష్యమని విక్రమ్ స్పష్టం చేశారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

tgpsc town planning department recruitment notification for 10 posts in telangana

TGPSC | తెలంగాణలో మరో జాబ్ అలర్ట్.. టౌన్ ప్లానింగ్ విభాగంలో పోస్టుల భర్తీ

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మరో అవకాశం లభించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాలను దశలవారీగా భర్తీ చేస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తాజాగా మరో...
- Advertisement -
Chat on WhatsApp