Sunday, February 22, 2026
No menu items!
spot_img
HomeNANDYALAllagaddaవైరల్ ఫీవర్‌పై ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చర్యలు

వైరల్ ఫీవర్‌పై ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చర్యలు

చాగలమర్రి మండలం తోడేళ్లపల్లె గ్రామం మల్లె వేముల గ్రామంలో వైరల్ ఫీవర్ తో చాలా కుటుంబాలు ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆ ఊర్లోల్లో పర్యటించి ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న వారిని పరామర్శించిన తగిన జాగ్రత్తలు పాటించాలని ఊరంతా శానిటైజింగ్ చేపించాలని అధికారులకు సూచించారు..

గ్రామాల్లో రెండు రోజులపాటు పక్క ఊరు నుంచి వాటర్ తెప్పించి ప్రజలందరికీ అందించాలని అధికారులకు సూచించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ……..

వైరల్ ఫీవర్ దగ్గు జ్వరము జలుబు వంట ఏమైనా లక్షణాలు ఉంటే వెంటనే అధికారులకు తెలియజేయాలని ఆశ వర్కర్లు మీకు అందుబాటులో ఉంటారని సరైన వైద్యం మీకు అందిస్తామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సూచించారు…

తోడేళ్లపల్లె గ్రామంలో 15 కేసులు మల్లె వేముల గ్రామంలో 12 కేసులు ఉన్నాయని వారి బ్లడ్ శాంపిల్స్ అన్ని పంపించామని రేపు ఉదయం అన్ని రిపోర్ట్స్ వస్తాయని డెంగ్యూ మలేరియా ఏ ప్రాబ్లం ఉన్న అధికారులందరూ అక్కడే ఉండి తగిన జాగ్రత్తలు తీసుకుంటారని ప్రజలు ఎవరు ఇబ్బందికి గురి కాకూడదని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు..

తోడేళ్లపల్లె మల్లె వేముల గ్రామాల్లో ఆశా వర్కర్లు ఎప్పటికీ అందుబాటులో ఉంటారని సీజనల్ వ్యాధులు కనుక చిన్నపిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలని వేడి నీటి వాటర్ ని తాగాలని రెండు రోజులపాటు బయట ఊర్లో నుంచి అధికారులు వాటర్ ట్యాంకర్లు తెప్పిస్తారని ఆ నీటిని తాగాలని ప్రజలకు సూచించారు…

ఈరోజు మీడియా మిత్రులు నాతోపాటు రెండు గ్రామాల్లో పర్యటించడం జరిగింది ఎందుకంటే ప్రజల సమస్యలను వారి ముందే తెలుసుకొని అధికారులకు వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది..

కొన్ని పేపర్లలో నేరాలు గోరాలు జరుగుతున్నాయని రాస్తున్నారని విషయం తెలుసుకొని రాయాలని మీరు రాసేదాన్ని బట్టే ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటారని. మీరు రాసిన ప్రతి ఒక సమస్యకు నేను సమాధానం ఇస్త…..

పర్యటించిన గ్రామాల్లో కేసులన్నీ జీరో అయ్యేంత వరకు అధికారులు పని చేయాలనీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ అధికారులకు సూచించారు…

ప్రజల ఆరోగ్య క్షేమం కోసమే ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ చెప్పడం జరిగింది…

ప్రతి వారానికి ఒక సారి వైద్యులు తమ పిహెచ్సి పరిధిలోని ప్రజలను సందర్శించి వారి ఆరోగ్య స్థితి గతులు అడిగి తెలుసుకొని అనారోగ్యంగా ఉంటే వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు…

అలాగే గ్రామంలో పంచాయితీ సిబ్బంది ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేస్తూ , ఓవర్ హెడ్ ట్యాంకులను శుభ్రపరచి ట్రాగునీటిని ప్రజలకు అందించాలన్నారు…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular