పశ్చిమ బెంగాల్-బంగ్లాదేశ్ సరిహద్దులో బీఎస్ఎఫ్ (BSF) జవాన్పై తీవ్ర దాడి జరిగింది. చొరబాటుదారులను అడ్డుకునే ప్రయత్నంలో ఉన్న సమయంలో, గుర్తు తెలియని దుండగులు ఆ జవాన్పై విరుచుకుపడి అతడిని అపహరించారు.ఈ ఘటన సోమవారం తెల్లవారుఝామున చోటుచేసుకుంది. సరిహద్దు గస్తీలో భాగంగా విధుల్లో ఉన్న బీఎస్ఎఫ్ జవాన్, అక్రమంగా భారత భూభాగంలోకి ప్రవేశిస్తున్న బంగ్లాదేశ్ చొరబాటుదారులను నిలువరిస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది.పలు గంటలపాటు అతడిని బంధించిన అనంతరం, స్థానిక గ్రామస్తుల మరియు బీఎస్ఎఫ్ అధికారుల ఒత్తిడితో చొరబాటుదారులు జవాన్ను వదిలిపెట్టినట్టు సమాచారం. గాయాలపాలైన జవాన్ను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై బీఎస్ఎఫ్ దర్యాప్తును ప్రారంభించింది. సరిహద్దు భద్రతపై తిరిగి ప్రశ్నలు లేవనెత్తిన ఈ ఘటన, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దృష్టికి చేరింది.








