Tuesday, July 14, 2026
Chat on WhatsApp
HomeNationalఈసారి నైరుతి రుతుపవనాలు అధిక వర్షాలను ఇస్తాయ్

ఈసారి నైరుతి రుతుపవనాలు అధిక వర్షాలను ఇస్తాయ్

-

Chat on WhatsApp

దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల అంచనాతో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ప్రజలకు మంచి వార్తను తెలిపింది. ఈ ఏడాది జూన్ నుండి సెప్టెంబర్ వరకు సాగే రుతుపవనాల సీజన్‌లో సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశముందని ప్రకటించింది. దీర్ఘకాలిక సగటుతో పోలిస్తే 105 శాతం వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది. ఇది దేశ రైతాంగానికి ఉత్సాహాన్నిస్తోందని పేర్కొంది.

ఈ అంచనాలు అనుకూల వాతావరణ పరిస్థితుల వల్ల వీలైనవని ఐఎండీ తెలిపింది. ముఖ్యంగా ఎల్ నినో, ఇండియన్ ఓషన్ డైపోల్ వంటి కీలక వాతావరణ వ్యవస్థలు తటస్థంగా ఉండటం దోహదపడుతుందని వివరించింది. అలాగే ఉత్తరార్ధగోళం, యూరేషియా ప్రాంతాల్లో మంచు కప్పుదల తక్కువగా ఉండటంతో రుతుపవనాలు మరింత చురుగ్గా కదులుతాయని వివరించింది.

ఈ అధిక వర్షపాతం అంచనా వ్యవసాయ రంగానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఖరీఫ్ పంటల ఉత్పత్తి మెరుగుపడే అవకాశం ఉండగా, నీటిమట్టాలు తగ్గిన జలాశయాలు తిరిగి నింపబడతాయనీ, ఇది ద్రవ్యోల్బణం తగ్గింపుకు దోహదం చేస్తుందని వారు అంటున్నారు. ఇటీవలి కాలంలో నీటి కొరతను ఎదుర్కొన్న ప్రాంతాలకు ఇది ఉపశమనం కలిగించనుంది.

క్రమం తప్పకుండా పదో ఏడాదిగా సాధారణం లేదా అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో, ఇది దేశ వాతావరణ స్థిరత్వాన్ని సూచిస్తోందని అధికారులు పేర్కొన్నారు. అయితే లడఖ్, తమిళనాడు, ఈశాన్య ప్రాంతాల్లో మాత్రం తక్కువ వర్షాలు నమోదయ్యే అవకాశమున్నట్లు ఐఎండీ హెచ్చరించింది. మొత్తంగా, ఈ అంచనాలు దేశ ఆర్థిక రంగానికి, గ్రామీణ అభివృద్ధికి దోహదంగా ఉండనున్నాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp