Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshALLURI SITHARAMA RAJU1/70 చట్టం అమలుపై టిడిపి నేతల స్పష్టమైన హామీ

1/70 చట్టం అమలుపై టిడిపి నేతల స్పష్టమైన హామీ

-

Chat on WhatsApp

అల్లూరి జిల్లా కేంద్రంలోని కిడారి క్యాంప్ కార్యాలయంలో టిడిపి నేతలు విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సర్పంచులు బాకూరు వెంకటరమణ రాజు, పాంగి పాండురంగ స్వామి, తామర్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీ హక్కుల పరిరక్షణకు 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తామని వారు స్పష్టం చేశారు.

డివిజన్ నాయకుడు, దారేల సర్పంచ్ పాంగి పాండురంగ స్వామి మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం ఆదివాసీలను మోసపుచ్చేందుకు ప్రలోభాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రజలు వాటికి లొంగకుండా తమ హక్కులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఆదివాసీలకు భంగం కలిగించే ఏ నిర్ణయమైనా తీసుకుంటే తాము పదవులకు రాజీనామా చేసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.

బాకూరు సర్పంచ్ బాకూరు వెంకటరమణ రాజు మాట్లాడుతూ ఆదివాసీ హక్కుల పరిరక్షణ టిడిపి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతగా తీసుకుంటుందని తెలిపారు. 1/70 చట్టాన్ని ఉల్లంఘించే యత్నాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలు తమ భూములపై హక్కులను రక్షించుకోవడానికి జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పెదబయలు మండల మహిళా అద్యక్షురాలు కిముడు మహేశ్వరి, శివ సాగర్, ఇతర టిడిపి నాయకులు పాల్గొన్నారు. సమావేశంలో ఆదివాసీ ప్రజల హక్కుల పరిరక్షణ, భూ సమస్యలు, ప్రభుత్వ విధానాలపై చర్చలు జరిగాయి. టిడిపి పార్టీ ఆదివాసీల భద్రతకు కట్టుబడి ఉంటుందని నేతలు హామీ ఇచ్చారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

tgpsc town planning department recruitment notification for 10 posts in telangana

TGPSC | తెలంగాణలో మరో జాబ్ అలర్ట్.. టౌన్ ప్లానింగ్ విభాగంలో పోస్టుల భర్తీ

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మరో అవకాశం లభించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాలను దశలవారీగా భర్తీ చేస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తాజాగా మరో...
- Advertisement -
Chat on WhatsApp