ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నార్కోటిక్ డాగ్ తో,సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా ఉంచుతున్నామని, ఎవరైనా గంజాయి,నాటు సారా అక్రమ రవాణా చేస్తే చర్యలు తప్పని నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ హెచ్చరించారు. సోమవారం నర్సీపట్నంలో గల డౌనూరు చెక్ పోస్ట్ వద్ద ముమ్మరంగా వాహనాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రావటం మాట్లాడుతూ బస్సులు, ఆటోలు, బైకులు, లారీలు, కార్లు ప్రతి ఒక్కరిని ఆపి తనిఖీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సిబ్బంది పాల్గొన్నారు.








