Tuesday, July 14, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshఅంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి కళ్యాణ మహోత్సవం

అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి కళ్యాణ మహోత్సవం

-

Chat on WhatsApp

సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవం సమీపిస్తోంది. ఫిబ్రవరి 7న రాత్రి 12.50 గంటలకు కళ్యాణం నిర్వహించనున్నట్లు ప్రధాన అర్చకులు శ్రీనివాస కిరణ్, స్థానాచార్యులు రామ రంగాచార్యులు, అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేడుకలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.

మూడో రోజు ఉత్సవాల్లో భాగంగా స్వామివారి హంస వాహన సేవను గ్రామోత్సవంగా నిర్వహించారు. రాత్రి అంకురార్పణ, ధ్వజారోహణ జరిపి, అనంతరం శేష వాహనంపై స్వామివారి సేవలను భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తుల కోసం ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయడంతో పాటు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.

సాయంత్రం ఆర్డీఓ కె. మాధవి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఈ రోజు స్వామివారి దర్శనానికి సుమారు 12 వేల భక్తులు హాజరయ్యారని, అన్నప్రసాద సేవలో పాల్గొన్నారని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ పరిసరాల్లో శానిటేషన్, భద్రత ఏర్పాట్లు నిర్వహించినట్లు వివరించారు.

అలాగే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా టోల్ ఫ్రీ నెంబర్ 08862-243500 ద్వారా కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని సంప్రదించాలని ఆర్డీఓ మాధవి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మహోత్సవం సందర్భంగా భక్తుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp