Wednesday, July 15, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshవిప్‌కు దిక్కులేని ప్రసన్న, బుచ్చి కౌన్సిలర్లు టిడిపిలో

విప్‌కు దిక్కులేని ప్రసన్న, బుచ్చి కౌన్సిలర్లు టిడిపిలో

-

Chat on WhatsApp

బుచ్చిరెడ్డి పాళెం నగర పంచాయతి వైస్ చైర్మన్ ఎన్నికలో మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డికి కఠినపరీక్ష ఎదురైంది. వైసిపి కౌన్సిలర్లు విప్‌ను పట్టించుకోకుండా టిడిపి వైపు అడుగులు వేయడంతో ఆయన ఆశలు భగ్నమయ్యాయి. పట్టణ కన్వీనర్ టంగుటూరు మల్లారెడ్డి, 10వ వార్డు కౌన్సిలర్ టీవీ మల్లారెడ్డి టిడిపిలో చేరడం కౌన్సిలర్ల వలసలను మరింత ఊపందించింది.

ఎన్నికల ముందు వరకూ ప్రసన్న తన అభ్యర్థిని గెలిపించుకుంటానని ధీమాగా ఉన్నా, కౌన్సిలర్ల వైసిపిని వీడి టిడిపిలో చేరడం ఆయనకు గట్టి ఎదురుదెబ్బగా మారింది. సీనియర్ నాయకుడు ఇప్పగుంట మల్లారెడ్డి నేతృత్వంలో పలువురు కౌన్సిలర్లు టిడిపిలో చేరారు. టిడిపి నేతల టచ్‌లో ఉన్న మరో ముగ్గురు కౌన్సిలర్లు కూడా త్వరలో పార్టీ మారనున్నట్టు సమాచారం.

ప్రసన్న కుమార్ రెడ్డి నియంతృత్వ ధోరణి, స్థానిక నేతలతో విభేదాలు కారణంగా కౌన్సిలర్లు అతన్ని వీడి వెళ్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వైసిపి శిబిరంలో నిరాశ నెలకొనగా, బుచ్చిరెడ్డి పాళెం అభివృద్ధి కోసం టిడిపిని ఎన్నుకున్నామని కొత్తగా చేరిన నేతలు ప్రకటించారు.

వైసిపి నుంచి వలసలు కొనసాగితే, బుచ్చిరెడ్డి పాళెం పంచాయతిలో టిడిపికి ఆధిక్యత పెరిగే అవకాశముంది. వైస్ చైర్మన్ ఎన్నికకు ముందు ఈ పరిణామాలు వైసిపికి గట్టి ఎదురుదెబ్బగా మారాయి. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నాయకత్వాన్ని నమ్మి టిడిపిలో చేరిన కౌన్సిలర్లు, పట్టణ అభివృద్ధికి తోడ్పడతామని ప్రకటించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

mega star chiranjeevi

Chiranjeevi: ముద్రగడ పద్మనాభంది రాజీపడని వ్యక్తిత్వం.. చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు 

కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన...
- Advertisement -
Chat on WhatsApp