Wednesday, July 15, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshకైలాం గ్రామంలో లెప్రసీ అవగాహన కార్యక్రమం

కైలాం గ్రామంలో లెప్రసీ అవగాహన కార్యక్రమం

-

Chat on WhatsApp

విజయనగరం జిల్లా మెంటాడ మండలం చల్లపేట పీహెచ్సీ పరిధిలో కైలాం గ్రామంలో లెప్రసీ అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆరోగ్య అధికారులు, ఆశా కార్యకర్తలు, గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. లెప్రసీ అనారోగ్య లక్షణాలు, ముందస్తు చికిత్స అవసరాన్ని వివరించారు.

ఎంపీహెచ్ఐవో శ్రీనివాసరావు మాట్లాడుతూ, స్పర్శ లేని మచ్చలు, దద్దుర్లు లెప్రసీ లక్షణాలని చెప్పారు. తొలిదశలో గుర్తిస్తే సులభంగా నయం చేయవచ్చని ప్రజలకు వివరించారు. హెల్త్ సూపర్వైజర్ ఉదయ్ కుమార్, హెచ్వి రమణమ్మ, ఏఎన్ఎం రమాదేవి, MLHP వెంకటలక్ష్మి లెప్రసీ నివారణ గురించి ప్రాముఖ్యత వివరించారు.

ఈ అవగాహన కార్యక్రమంలో ఆశా కార్యకర్త రవణమ్మ, టీడీపీ నాయకులు కొరిపల్లి చిన్నంనాయుడు, లోకారపు తిరుపతి, గ్రామస్థులు పాల్గొన్నారు. ప్రజలు లెప్రసీ గురించి భయపడకుండా, తొందరగా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

గ్రామస్థులు ఈ కార్యక్రమానికి హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆరోగ్య సేవలను వినియోగించుకోవాలని, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని వైద్యులు సూచించారు. ఈ అవగాహన కార్యక్రమం ద్వారా గ్రామంలో ఆరోగ్యంపై చైతన్యం పెరిగిందని స్థానికులు తెలిపారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

mega star chiranjeevi

Chiranjeevi: ముద్రగడ పద్మనాభంది రాజీపడని వ్యక్తిత్వం.. చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు 

కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన...
- Advertisement -
Chat on WhatsApp