Thursday, July 30, 2026
Chat on WhatsApp
HomeNationalPM Modi | మోడీ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం.. అంతర్జాతీయ పరిస్థితులపై సమీక్ష

PM Modi | మోడీ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం.. అంతర్జాతీయ పరిస్థితులపై సమీక్ష

-

Chat on WhatsApp

PM Modi: ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ న్యూఢిల్లీలో అత్యున్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ భేటీకి కేంద్ర ప్రభుత్వంలోని కీలక మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. అయితే సమావేశానికి సంబంధించిన అధికారిక అజెండాను ప్రభుత్వం వెల్లడించలేదు. ఈ కీలక సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ పాల్గొన్నారు.

అలాగే ఆరోగ్యం, రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, పోర్టులు, నౌకాశ్రయాలు, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ కూడా సమావేశానికి హాజరయ్యారు. కేబినెట్ కార్యదర్శితో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొనడంతో ఈ భేటీకి మరింత ప్రాధాన్యం ఏర్పడింది. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, కొనసాగుతున్న ఉక్రెయిన్ యుద్ధం, అంతర్జాతీయ వాణిజ్య మార్గాల్లో భద్రతా సవాళ్ల నేపథ్యంలో ఈ సమావేశం జరిగినట్లు భావిస్తున్నారు.

ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి, ఎర్ర సముద్రం ప్రాంతాల్లో వాణిజ్య నౌకల రాకపోకలకు ఎదురవుతున్న సమస్యలు, భారతీయ నావికుల భద్రత అంశాలపై కేంద్రం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇటీవల భారతీయులు పనిచేస్తున్న నౌకలపై దాడుల నేపథ్యంలో రష్యా, ఉక్రెయిన్ రాయబారులను విదేశాంగ శాఖ వివరణ కోరింది.

ప్రపంచ సముద్ర రవాణా రంగానికి అత్యధిక సంఖ్యలో నావికులను అందిస్తున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. BIMCO-ICS Seafarer Workforce Report 2026 ప్రకారం, ప్రపంచ షిప్పింగ్ రంగంలో భారత్ నుంచి 3,11,936 మంది సముద్ర నిపుణులు సేవలందిస్తున్నారు. అయితే ఈ సమావేశంలో చర్చించిన అంశాలను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Nara Lokesh Announces Rs 5,750 Crore Green Energy Project in Pattikonda

Nara Lokesh | పత్తికొండలో భారీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు శ్రీకారం 

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్ ఎనర్జీ రంగానికి మరింత బలం చేకూర్చే మరో మెగా ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని...
- Advertisement -
Chat on WhatsApp