Sunday, February 22, 2026
No menu items!
spot_img
HomeInterNationalఅమెరికాలో విమానం-హెలికాప్టర్ ఢీ - 18 మృతదేహాలు వెలికితీత

అమెరికాలో విమానం-హెలికాప్టర్ ఢీ – 18 మృతదేహాలు వెలికితీత

అమెరికాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విమానం, ఆర్మీ హెలికాప్టర్ గాల్లో ఢీకొని పోటోమాక్ నదిలో కూలిపోయాయి. అధికారులు ఇప్పటివరకు 18 మృతదేహాలను వెలికితీశారు. విమానంలో మొత్తం 64 మంది ఉండగా, హెలికాప్టర్‌లో ముగ్గురు సైనికులు ఉన్నారని తెలిపారు. రెస్క్యూ బృందాలు మిగిలిన ప్రయాణికుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

వాషింగ్టన్ ఎయిర్‌పోర్టుకు చేరుకోవడానికి ప్రయత్నిస్తుండగా, పీఎస్ఏ ఎయిర్‌లైన్స్ విమానం ఆర్మీ హెలికాప్టర్‌ను ఢీకొట్టింది. క్షణాల్లో రెండు ముక్కలై పోటోమాక్ నదిలో పడిపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో నదిలో ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీల్లో ఉండటంతో బతికి బయటపడే అవకాశం తక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు.

వైట్ హౌస్‌కు 5 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ ప్రమాదంపై ప్రెసిడెంట్ ట్రంప్ స్పందించారు. అధికారులతో మాట్లాడి సహాయ చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. బాధితుల రక్షణ కోసం ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తోందని తెలిపారు. రెస్క్యూ టీములు నీటిలో మిగిలిన మృతదేహాల కోసం శ్రమిస్తున్నాయి.

ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లోని సైనికులు రక్షణ చర్యలు తీసుకున్నప్పటికీ తీవ్ర ప్రభావం ఏర్పడింది. విమాన ప్రయాణికులకు గడ్డకట్టించే చలి వల్ల ప్రాణాపాయం పెరిగింది. అధికారుల ప్రకారం, కూలిన విమానం శకలాలు పరిసర ప్రాంతాల్లో విస్తరించి ఉన్నట్లు గుర్తించారు. మరిన్ని మృతదేహాలు వెలికితీయే అవకాశం ఉందని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular