Sunday, July 12, 2026
Chat on WhatsApp
HomeTelanganaHyderabadPhone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం...డేటా డిలీట్ చేశారా?

Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం…డేటా డిలీట్ చేశారా?

-

Chat on WhatsApp

Phone Tapping Case: తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ సుప్రీంకోర్టులో రేపటికి వాయిదా పడింది. కేసు దర్యాప్తుకు సంబంధించి ప్రభుత్వం తరఫున న్యాయవాది ధర్మాసనానికి కీలక విషయాలు వెల్లడించారు. కేసులో నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు దర్యాప్తు సంస్థతో సహకరించడం లేదని, విచారణను ఆలస్యం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

ALSO READ:ICC ODI Rankings | రెండో స్థానానికి విరాట్‌ కోహ్లీ.. నెంబర్‌ వన్‌గా రోహిత్‌ శర్మ

ప్రభాకర్ రావు తమతో “ఆటలాడుతున్నాడు” అని న్యాయవాది పేర్కొంటూ, దర్యాప్తును ప్రభావితం చేసే కీలక రుజువులను నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. ముఖ్యంగా, ఆయన ఐక్లౌడ్‌లోని డేటాను డిలీట్ చేసినట్లు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమాచారం అందించింది. ఈ చర్య దర్యాప్తుపై ప్రభావం చూపవచ్చని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

ఇక, ప్రభాకర్ రావు తరఫున హాజరుకావాల్సిన సీనియర్ న్యాయవాది ఆ రోజు అందుబాటులో లేకపోవడంతో ధర్మాసనం విచారణను రేపటికి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించిన కీలక అంశాలపై తదుపరి విచారణలో మరిన్ని వాదనలు వినిపించే అవకాశం ఉంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ins-mahendragiri-inducted-into-indian-navy-rajnath-singh

Rajnath Singh | సముద్రంలో భారత్‌కు తిరుగులేదు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన

Rajnath Singh: భారత సముద్ర భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళంలో కొత్తగా...
- Advertisement -
Chat on WhatsApp