Tuesday, June 30, 2026
Chat on WhatsApp
HomeSportsముంబై చేతిలో పంజాబ్ ఓటమితో మారినల లెక్కలు...ఇక ఈ జట్లకే ఎక్కువ ఛాన్స్

ముంబై చేతిలో పంజాబ్ ఓటమితో మారినల లెక్కలు…ఇక ఈ జట్లకే ఎక్కువ ఛాన్స్

-

Chat on WhatsApp

IPL 2026 playoffs Race: ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ రేసు రోజురోజుకూ ఉత్కంఠభరితంగా మారుతోంది. తాజాగా ముంబై ఇండియన్స్ చేతిలో పంజాబ్ కింగ్స్ ఓటమి కావడంతో పాయింట్ల పట్టిక సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఒక దశలో వరుస విజయాలతో ప్లే ఆఫ్స్‌కు చేరడం ఖాయమని అనుకున్నప్పటికీ పంజాబ్ ఇప్పుడు కష్టాల్లో పడింది.

శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని జట్టు వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో విజయాన్ని అందుకోలేకపోవడంతో పరిస్థితి క్లిష్టమైంది. ప్రస్తుతం 13 పాయింట్లతో ఉన్న పంజాబ్‌కు మిగిలిన రెండు మ్యాచ్‌లు కీలకంగా మారాయి. చెన్నై, రాజస్థాన్ జట్లతో జరిగే మ్యాచ్‌లు వారి భవితవ్యాన్ని నిర్ణయించనున్నాయి.

అటు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పరిస్థితి కూడా అంత సురక్షితం కాదు. ఆర్సీబీకి ఇంకా సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్‌తో రెండు కీలక మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి.

ఈ రెండు మ్యాచ్‌ల్లో కనీసం ఒకటి గెలిస్తే 18 పాయింట్లతో ప్లే ఆఫ్స్ చేరే అవకాశం ఉంటుంది. కానీ రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోతే 16 పాయింట్ల వద్దే నిలిచిపోయి ఇతర జట్ల రన్‌రేట్ ప్రభావంతో వెనుకబడే ప్రమాదం ఉంది.

ఇక ప్లే ఆఫ్స్ రేసులో గుజరాత్ టైటాన్స్ బలమైన స్థితిలో ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కూడా అవకాశాలు మెరుగ్గానే కనిపిస్తున్నాయి. పంజాబ్ కింగ్స్‌కు ఇంకా అవకాశాలు ఉన్నప్పటికీ, మిగిలిన మ్యాచ్‌ల్లో విజయం సాధించడం తప్పనిసరి.

చివరి వరకు నెట్ రన్‌రేట్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉండటంతో ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ రేసు మరింత రసవత్తరంగా మారింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

india women's cricket team qualifies for los angeles 2028 olympics

2028 Los Angeles Olympics | టీ20 ప్రపంచకప్‌లో నిరాశ.. ఒలింపిక్స్‌కు అర్హతతో భారత...

2028 Los Angeles Olympics: టీ20 ప్రపంచకప్‌ 2026లో ఆశించిన స్థాయిలో రాణించలేక గ్రూప్ దశలోనే టోర్నీకి వీడ్కోలు పలికిన భారత మహిళల క్రికెట్ జట్టుకు ఇప్పుడు ఒక శుభవార్త లభించింది. ప్రపంచకప్‌లో...
- Advertisement -
Chat on WhatsApp