Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshALLURI SITHARAMA RAJUఅల్లూరి జిల్లా ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

అల్లూరి జిల్లా ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

-

Chat on WhatsApp

అల్లూరి జిల్లా దేవీపట్నం మండలంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రంపచోడవరం సబ్ కలెక్టర్ కల్పశ్రీ ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని తెలిపారు.

ఆమె మాట్లాడుతూ, రైతులకు మెరుగైన మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించిందని, నిర్దేశించిన ధర ప్రకారమే ధాన్యం కొనుగోలు జరుగుతుందని వివరించారు. వాతావరణ మార్పులు కారణంగా రైతులు ఇబ్బందులు పడకుండా ఈ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ప్రభుత్వం 75 కేజీల ధాన్యానికి రూ. 1,725, వంద కేజీల ధాన్యానికి రూ. 2,300 మద్దతు ధరగా నిర్ణయించినట్లు తెలిపారు. కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతులకు డబ్బులు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. రైతులు దళారులను నమ్మి తక్కువ ధరకు ధాన్యం అమ్మకూడదని స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖ మరియు ప్రభుత్వ ప్రోత్సాహంతో పంటల విక్రయం సజావుగా సాగుతుందని తెలిపారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

seethakka launches mobile anganwadi center vehicle for children welfare in telangana

Mobile Anganwadi | ఒక్క చిన్నారి కూడా సేవలకు దూరం కాకూడదు.. మొబైల్ అంగన్‌వాడీలపై...

Mobile Anganwadi: నేటి చిన్నారులే రేపటి దేశ నిర్మాణంలో కీలక భాగస్వాములని, వారి అభివృద్ధిపై పెట్టే పెట్టుబడే రాష్ట్ర పురోగతికి మార్గం చూపుతుందని మంత్రి సీతక్క అన్నారు. తెలంగాణ–2047 లక్ష్య సాధనలో నేటి...
- Advertisement -
Chat on WhatsApp