Sunday, February 22, 2026
No menu items!
spot_img
HomeAndhra Pradeshఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మోడల్ ఏపీ సెట్ పరీక్షలు

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మోడల్ ఏపీ సెట్ పరీక్షలు

భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) శ్రీకాకుళం జిల్లా ఆధ్వర్యంలో మోడల్ ఏపీ సెట్ పరీక్షలను ఏప్రిల్ 15 నుండి 17 వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు శ్రీకాకుళంలోని శివాని కళాశాలలో జరుగనున్నట్టు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పి పవిత్ర మరియు కార్యదర్శి డి చందు తెలియజేశారు. శుక్రవారం జరిగిన పత్రిక విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ అంటే కేవలం విద్యారంగ సమస్యలపై పోరాటం చేసే సంఘమే కాకుండా, విద్యార్థుల్లో ఉన్న పరీక్ష భయాన్ని తొలగించేందుకు ప్రయత్నించే సంఘమని చెప్పారు. విద్యార్థుల కోసం ఇలాంటి మోడల్ పరీక్షలు ఏర్పాటు చేయడం ద్వారా వారు మెరుగైన ఫలితాలు సాధించగలరని పేర్కొన్నారు.

గతంలో నిర్వహించిన ప్రజ్ఞ వికాస్ మోడల్ పరీక్ష ద్వారా విద్యార్థులు 10వ తరగతిలో బాగా రాణించారని గుర్తుచేశారు. అదే విధంగా ఈసారి నిర్వహించబోయే మోడల్ ఎంసెట్ పరీక్ష కూడా పూర్తి స్థాయిలో ఆన్లైన్‌లోనే నిర్వహించబడుతుందని, ఇది అసలైన ఎంసెట్ మాదిరిగానే ఉంటుందని చెప్పారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని మెరుగైన ర్యాంకులు సాధించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి రాహుల్, నాయకులు గోవర్ధన్, శిరీష తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల శ్రేయస్సు కోసమే ఎస్ఎఫ్ఐ ఈ విధమైన ప్రయోగాత్మక పద్ధతుల్ని అమలు చేస్తోందని వారు తెలిపారు. విద్యార్థులు ఆసక్తిగా పాల్గొనాలని, ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేయాల్సిందిగా కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular