Wednesday, July 15, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshనరసరావుపేట బర్డ్ ఫ్లూ ఘటనపై వైద్య బృందం స్పందన

నరసరావుపేట బర్డ్ ఫ్లూ ఘటనపై వైద్య బృందం స్పందన

-

Chat on WhatsApp

నరసరావుపేటలో బర్డ్ ఫ్లూ ప్రభావంతో వైద్య బృందాలు పరిశీలన చేపట్టాయి. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. బర్డ్ ఫ్లూ మూలాలను కనుగొనడానికి మెడికల్, హెల్త్ టీములు పని చేస్తున్నాయని తెలిపారు. వైరస్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుని, అవసరమైన చర్యలు తీసుకోవడానికి వైద్య నిపుణులు కృషి చేస్తున్నారు.

ఢిల్లీ నుంచి వైద్య నిపుణుల బృందం మంగళగిరికి చేరుకుంది. అయితే, వారు నరసరావుపేట ప్రాంతానికి వస్తారో లేదో ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుతానికి మంగళగిరి నుండే పూర్తి స్థాయిలో అధ్యయనం జరుగుతోంది. స్థానిక వైద్య బృందం బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాన్ని స్క్రీనింగ్ చేసి, ప్రజలకు తగిన వైద్య పరీక్షలు నిర్వహించింది.

ప్రస్తుత పరిశీలనలో ఆ ప్రాంతంలోని ఎవరికీ బర్డ్ ఫ్లూ లక్షణాలు లేకపోయాయని వైద్య బృందం నిర్ధారించింది. ఎవరికీ పాజిటివ్ కేసులు నమోదు కాలేదని స్పష్టం చేశారు. అయితే, అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు.

ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ఆహారాన్ని హైజినిక్‌గా వండుకుని తింటే ఎలాంటి సమస్యలు ఎదురవ్వవని అధికారులు తెలిపారు. ప్రస్తుత పరిస్థితిని బట్టి ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

mega star chiranjeevi

Chiranjeevi: ముద్రగడ పద్మనాభంది రాజీపడని వ్యక్తిత్వం.. చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు 

కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన...
- Advertisement -
Chat on WhatsApp