Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshగుంటూరులో మాలల మహాగర్జనకు కోదాడ సర్పంచ్ పిలుపు

గుంటూరులో మాలల మహాగర్జనకు కోదాడ సర్పంచ్ పిలుపు

-

Chat on WhatsApp

ఈ నెల 15వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు గుంటూరులో లక్షలాది మాలలతో మాలల మహాగర్జన కార్యక్రమం విజయవంతం చేయాలని కోదాడ సర్పంచ్ బూర్తి నాని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ వ్యతిరేకమని, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ, క్రిమిలేయర్ నిర్ణయాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మాలల హక్కుల కోసం జరుగుతున్న ఈ మహాగర్జనలో లక్షలాదిగా పాల్గొనాలని, ఈ కార్యక్రమం భవిష్యత్తు కోసం కీలకమని నాని వివరించారు.

కరపత్రాలను విడుదల చేసిన ఈ కార్యక్రమంలో శివకోటి రాజు, బత్తిన అచ్చారావు, నక్క నాగు, శివకోటీ అప్పలకొండ తదితరులు పాల్గొన్నారు. ఈ మహాగర్జన మాలల ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తుందని నాయకులు తెలిపారు.

అంబేద్కర్ ఆశయాలను నిజం చేసే ఈ కార్యక్రమం విజయవంతం చేయడం ప్రతి మాలుడి బాధ్యత అని నాని పిలుపునిచ్చారు. గుంటూరు సభ ద్వారా సమాజంలో తగిన మార్పులు తీసుకురావాలని, రాజ్యాంగ హక్కులను కాపాడుకోవాలని మాల నేతలు కోరారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

tgpsc town planning department recruitment notification for 10 posts in telangana

TGPSC | తెలంగాణలో మరో జాబ్ అలర్ట్.. టౌన్ ప్లానింగ్ విభాగంలో పోస్టుల భర్తీ

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మరో అవకాశం లభించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాలను దశలవారీగా భర్తీ చేస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తాజాగా మరో...
- Advertisement -
Chat on WhatsApp