Wednesday, July 15, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshవిజయనగరం టీడీపీ సమావేశంలో కీలక చర్చలు

విజయనగరం టీడీపీ సమావేశంలో కీలక చర్చలు

-

Chat on WhatsApp

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు సూచనల ప్రకారం విజయనగరంలో పార్టీ సమావేశం నిర్వహించారు. పార్టీ కార్యాలయం అశోక్ గారి బంగ్లాలో జరిగిన ఈ సమావేశానికి పొలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతి రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

పార్టీని బలోపేతం చేసేందుకు కుటుంబ సాధికార సారధులను నియమించడం, బూత్ కన్వీనర్లు, గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి కమిటీలను ఏర్పాటుచేయడం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. పార్టీ ఆదేశాల మేరకు ఐదు రోజుల్లోగా కుటుంబ సాధికార సారధులను నియమించి, పార్టీ కార్యాలయానికి సమర్పించాలని నిర్ణయించారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని డివిజన్, గ్రామ పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్పొరేటర్లు, ఎంపిటీసీలు, సర్పంచులు, పార్టీ ముఖ్యనాయకులు పాల్గొన్నారు. పార్టీని పునఃగాడిలో పెట్టేలా నాయకత్వ నిర్మాణాన్ని మరింత సమగ్రంగా రూపొందించాలని నేతలు తీర్మానించారు.

రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, బూత్ స్థాయిలో పార్టీని మరింత మెరుగుపరచే దిశగా చర్యలు తీసుకోవాలని నేతలు పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి, ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను బయట పెట్టాలని, తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని నేతలు స్పష్టం చేశారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

mega star chiranjeevi

Chiranjeevi: ముద్రగడ పద్మనాభంది రాజీపడని వ్యక్తిత్వం.. చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు 

కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన...
- Advertisement -
Chat on WhatsApp