Kerala News: కేరళలోని గురువాయర్ పట్టణంలో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేకమైన క్రిస్మస్ ట్రీ(Christmas tree) ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. ఖాళీ బీర్ బాటిళ్లతో తయారు చేసిన క్రిస్మస్ ట్రీని AKG మెమోరియల్ గేట్ వద్ద ఏర్పాటు చేయడంతో పండుగ ఆనందం కంటే వివాదమే ఎక్కువైంది.
మున్సిపల్ కౌన్సిల్లో చర్చ
ఆదివారం జరిగిన కొత్తగా ఎన్నికైన గురువాయూర్(Guruvayur) మున్సిపల్ కౌన్సిల్ తొలి సమావేశంలో ఈ అంశం తీవ్ర చర్చకు దారితీసింది. కాంగ్రెస్ కౌన్సిలర్ బషీర్ పూకోడ్ ఈ విషయాన్ని లేవనెత్తగా, యూడీఎఫ్ సభ్యులు జాయ్ చెరియన్, ఆంటో థామస్ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఖాళీ మద్యం సీసాలతో క్రిస్మస్ వేడుకలు జరపడం తప్పు సందేశం ఇస్తుందని వారు పేర్కొన్నారు.
మున్సిపాలిటీ వివరణ
ప్రతిపక్ష కౌన్సిలర్లు మున్సిపల్ కార్యదర్శిని కలిసి నిరసన తెలిపారు. అయితే ఆయన స్పందిస్తూ, ఈ క్రిస్మస్ ట్రీ ఉద్దేశ్యం మద్యం వినియోగాన్ని ప్రోత్సహించడం కాదని, రిసైక్లింగ్ మరియు సస్టైనబిలిటీపై అవగాహన కల్పించడమే లక్ష్యం అని స్పష్టం చేశారు. ప్రజల్లో చర్చకు దారితీసే “conversation starter”గా దీనిని రూపొందించినట్లు తెలిపారు.
ట్రీ ప్రత్యేకత
సంప్రదాయ కోన్ ఆకారంలో, ఆకుపచ్చ గ్లాస్ బీర్ బాటిళ్లను లోపలికి అమర్చిన ఈ ట్రీపై ఎరుపు నక్షత్రం, క్రిస్మస్ బబుల్స్, గంటలు అలంకరించారు. ఈస్ట్ నడ గేట్ వద్ద ఎరుపు కార్పెట్పై ఏర్పాటు చేసిన ఈ ట్రీని చూసి ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే యూడీఎఫ్ నేతలు ఇది పట్టణానికి తప్పు సందేశం ఇస్తోందని ఆరోపిస్తూ, ట్రీని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
Beer bottle christmas tree | బీర్ బాటిళ్లతో క్రిస్మస్ ట్రీ…కేరళలో రాజకీయ దుమారం
Beer bottle Christmas tree set up near AKG Memorial Gate in Guruvayur sparks debate
