తెలంగాణ హైదరాబాద్ లో అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్స్ రీజనల్ మీటింగ్ ఈరోజు జరిగింది .హైదరాబాద్ అభివృద్ధి వేగం ప్రపంచ స్థాయి నగరాలతో పోల్చదగిన స్థాయికి చేరిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్స్ రీజనల్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ, నగరం ఇప్పుడు సింగపూర్, టోక్యో వంటి అంతర్జాతీయ మెట్రో నగరాలతో పోటీ పడే స్థితికి చేరిందని పేర్కొన్నారు.
ALSO READ:Congo Minister Plane Accident: కాంగోలో మంటల్లో చిక్కుకున్న మంత్రి విమానం
హైదరాబాద్ అభివృద్ధి చెందితే, భారత ఆర్థిక వ్యవస్థలో కూడా మరింత కీలక పాత్ర పోషిస్తుందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. 2047 నాటికి భారతదేశం లక్ష్యంగా పెట్టుకున్న 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీలో, తెలంగాణ నుండి కనీసం 10 శాతం వాటా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు.
టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్నోవేషన్ రంగాల్లో తెలంగాణ ముందంజలో ఉందని, దీనిని ప్రపంచస్థాయి అర్బన్ మోడల్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం వేగంగా పనిచేస్తోందని సీఎం స్పష్టం చేశారు.









