Sunday, July 12, 2026
Chat on WhatsApp
HomeOthersపసిడి, వెండి ధరలు ఎగసిపడ్డాయి… ఖరీదుకి షాక్!

పసిడి, వెండి ధరలు ఎగసిపడ్డాయి… ఖరీదుకి షాక్!

-

Chat on WhatsApp

దేశవ్యాప్తంగా పసిడి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. ప్రత్యేకించి హైదరాబాద్ మార్కెట్‌లో ఏప్రిల్ 10, 2025న బంగారం ధరల పెరుగుదల స్పష్టంగా కనిపించింది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.2,940 పెరిగి రూ.93,380కు చేరగా, 22 క్యారెట్ల ధర రూ.2,700 పెరిగి రూ.85,600గా నమోదైంది. 18 క్యారెట్ల పసిడి ధర కూడా రూ.2,210 పెరిగింది.

ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు, వడ్డీ రేట్ల తగ్గుదల, డాలర్ బలహీనత వంటి అంశాలు ఉన్నాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్ విధించిన సుంకాల పుణ్యమా అని రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో పసిడి ధరలు మరింతగా పుంజుకున్నాయి.

అంతేకాక, భవిష్యత్ ఆర్థిక అనిశ్చితి, వడ్డీ రేట్ల తక్కువ అంచనాలు, ద్రవ్యోల్బణం భయాలు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా మార్చాయి. దీంతో ఇన్వెస్టర్లు బంగారంపై దృష్టి పెడుతుండటంతో ధరలు మరింత ఎగబాకుతున్నాయి. సామాన్య ప్రజలకు ఇది భారంగా మారుతోంది.

ఇదిలా ఉండగా, వెండి ధరలు కూడా Hyderabadలో పెరిగాయి. కిలో వెండి ధర రూ.2,000 పెరిగి రూ.1,04,000కి చేరగా, 100 గ్రాముల వెండి ధర రూ.200 పెరిగి రూ.10,400గా నమోదైంది. బంగారం ధరల పెరుగుదల వెండిపై కూడా ప్రభావం చూపించినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ins-mahendragiri-inducted-into-indian-navy-rajnath-singh

Rajnath Singh | సముద్రంలో భారత్‌కు తిరుగులేదు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన

Rajnath Singh: భారత సముద్ర భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళంలో కొత్తగా...
- Advertisement -
Chat on WhatsApp