Delhi Airport: ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(Indira Gandhi International Airport) లో గురువారం మధ్యాహ్నం ఒక విమాన ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్నం సుమారు 2:15 గంటల సమయంలో స్పైస్జెట్ విమానం టాక్సింగ్ చేస్తుండగా, పార్క్ చేసి ఉన్న అకాసా ఎయిర్ విమానాన్ని ఢీకొట్టింది.
ఈ ఘటనలో రెండు విమానాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. అయితే అదృష్టవశాత్తూ ప్రయాణికులు లేదా సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే ఎయిర్పోర్ట్ సిబ్బంది అప్రమత్తమై పరిస్థితిని నియంత్రించారు.
ఈ సంఘటనతో విమానాశ్రయంలో కొంతసేపు ఆందోళన వాతావరణం నెలకొన్నప్పటికీ, ఇతర విమాన కార్యకలాపాలకు పెద్ద అంతరాయం కలగలేదని సమాచారం. అధికారులు భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు.
Delhi Airport | స్పైస్జెట్ విమానం ఢీకొట్టిన అకాసా ఎయిర్ ప్లేన్ – ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఘటన
-








