Sunday, February 22, 2026
No menu items!
spot_img
HomeFilms News'ఛావా' చిత్రం తెలుగు బాక్సాఫీస్‌ను కుదిపేస్తోంది

‘ఛావా’ చిత్రం తెలుగు బాక్సాఫీస్‌ను కుదిపేస్తోంది

విక్కీ కౌశల్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన చారిత్రక చిత్రం ‘ఛావా’ ఇటీవల తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మూడు వారాల తర్వాత తెలుగు వెర్షన్ విడుదలైనప్పటికీ, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను సాధిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మార్చి 7న విడుదలైన ‘ఛావా’ మొదటి రోజే సుమారు రూ.3 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.

రెండో రోజుకూడా ఈ చిత్రం అదే జోరును కొనసాగిస్తూ, సుమారు రూ.2.5 కోట్ల వసూళ్లు సాధించింది. దీంతో, రెండు రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో ‘ఛావా’ సుమారు రూ.5.8 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.వీకెండ్‌లో మౌత్ పబ్లిసిటీ బాగుండటంతో, కలెక్షన్లు మరింతగా పెరిగే అవకాశం ఉంది.

హిందీలో ఇప్పటికే ‘ఛావా’ ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్ల గ్రాస్ వసూళ్లను దాటేసింది. మూడు వారాల తర్వాత కూడా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. తెలుగు వెర్షన్‌కు కూడా ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది, ఇది చిత్ర యూనిట్‌కు ఆనందాన్ని కలిగిస్తోంది.

‘ఛావా’ చిత్రంలో విక్కీ కౌశల్ ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ పాత్రలో నటించగా, రష్మిక మందన్న ప్రధాన పాత్రలో మెరిసింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకోవడంలో సఫలమైంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular