Sunday, July 26, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshచంద్రబాబుకు అమరావతిలో 5 ఎకరాల వ్యక్తిగత స్థలం కొనుగోలు

చంద్రబాబుకు అమరావతిలో 5 ఎకరాల వ్యక్తిగత స్థలం కొనుగోలు

-

Chat on WhatsApp

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి రాజధానిలో 5 ఎకరాల స్థలం కొనుగోలు చేశారు. ఈ స్థలం జడ్జిల బంగ్లాలు, ప్రభుత్వ కార్యాలయ సముదాయం, ఎన్జీవోల రెసిడెన్సీల సమీపంలో ఉంది. ఇంటి నిర్మాణం కోసం ప్రత్యేకంగా ఈ స్థలాన్ని తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం సాయిల్ టెస్టులు జరుగుతున్నాయి. ఐదెకరాల స్థలంలో కొంత భాగంలో ఇల్లు నిర్మించి, మిగిలిన భాగం పార్కింగ్, గార్డెన్, సెక్యూరిటీ కోసం ఉపయోగిస్తారు.

గతంలో చంద్రబాబు అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేస్తూ అక్కడ సొంత ఇల్లు నిర్మిస్తానని అనేకసార్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే వెలగపూడి రెవెన్యూ పరిధిలో 25వేల చదరపు గజాల స్థలం కొనుగోలు చేశారు. ఈ స్థలం నాలుగు వైపులా రహదారులతో కలిగి, పరిపాలనా కార్యాలయాలకు దగ్గరగా ఉంది.

ఈ స్థలాన్ని ముగ్గురు రైతుల నుండి కొనుగోలు చేశారు. భూమి కోసం రైతులకు నష్టపరిహారం చెల్లించినట్లు సమాచారం. ఇప్పటివరకు చంద్రబాబు ఉండవల్లి బ్రిడ్జ్ రోడ్ లోని లింగమనేని అతిథి గృహంలో నివాసం ఉన్నారు. అమరావతి రాజధాని అభివృద్ధి పూర్తయిన తర్వాతే సొంత ఇంటికి మారాలని చంద్రబాబు సంకల్పం చూపించారు.

ఇప్పటికే చంద్రబాబుకు హైదరాబాద్ లో సొంత ఇల్లు ఉంది. రాజధాని నగరంలో ఇంటిని నిర్మించడమ ద్వారా ఆయన అమరావతికి తన అంకితభావాన్ని చూపించారు. రాజధాని నిర్మాణానికి ఆయన తీసుకుంటున్న చర్యలను రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా పరిశీలిస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp