
కడప జడ్పీ చైర్మన్ ఎన్నికల్లో పోటీ చేయని టీడీపీ
కడప జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం లేదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. వైఎస్సార్సీపీకి చెందిన జడ్పిటిసి సభ్యులు కొందరు బీజేపీ, కొందరు జనసేనలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీకి తగిన సంఖ్యాబలం లేకపోవడంతో పోటీ చేయడం లేదని, అయితే వైసీపీ నాయకులు తమ పార్టీ సభ్యులపై నమ్మకం లేక క్యాంపు రాజకీయాలు నడుపుతున్నారని శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు…