మెంటాడ టిడిపి నేతలు సంధ్యారాణిపై విమర్శలపై స్పందన
విజయనగరం జిల్లా మెంటాడ మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మెంటాడ మండల అధ్యక్షుడు చలుమూరి వెంకట్రావు మాట్లాడుతూ, అభివృద్ధిని చూసి ఓర్వలేక రాష్ట్రమంత్రి గుమ్మిడి సంధ్యారాణిపై అనవసర విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. సోమవారం సాయంత్రం పార్టీ నాయకులతో కలిసి మాట్లాడారు. మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర సాలూరులో మంత్రి సంధ్యారాణిపై చేసిన విమర్శలు తగవని ఆయన పేర్కొన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి లేకపోవడంతో ప్రజలు కూటమి ప్రభుత్వానికి…
