Rathasaptami celebrations in Arasavalli, Srikakulam, were grand. MLA Gundu Shankar personally supervised and ensured devotees’ comfort.

రథసప్తమి వేడుకల్లో భక్తులకో ఆనందోత్సాహం

శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. భక్తుల సందడితో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించగా, భక్తులు స్వామివారి దర్శనం పుణ్యం పొందారు. దేవాలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పక్కాగా చేపట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకున్నారు. స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ స్వయంగా వేడుకలను పర్యవేక్షించారు. ద్విచక్ర వాహనంపై తిరుగుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవడం విశేషం. ఆయన…

Read More
The chat vendor business in Srikakulam is growing, but there are concerns over quality and hygiene. People are facing health risks due to poor preparation.

శ్రీకాకుళం చాట్ బండి వ్యవహారంలో నాణ్యతా సమస్యలు

శ్రీకాకుళం నగరంలో ప్రకాశ్ చాట్ బండి వ్యాపారం రోజురోజుకు విస్తరిస్తోంది. ఆదాయం పెరిగిపోతున్నా, చాట్ తయారీలో నాణ్యత, పరిశుభ్రత, భద్రత పట్ల పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ బండి వద్ద బంగాళాదుంపలు, వేరుశనగ కాయలు, అరటికాయలను సరైన విధంగా పరిశీలించకుండా ఉపయోగిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. చాట్ తయారీలో ఉపయోగించే ఉడికించిన బంగాళాదుంపలను ఓ వంట పాత్రలో వేసి కాళ్లతో తొక్కడం, ఇదే విధంగా ఇతర పదార్థాలను కలపడం ప్రజల ఆరోగ్యానికి పెద్ద ప్రమాదమని చెప్పారు. ఈ విధంగా…

Read More
Shocking revelations in the murder case of YSRCP leader Chandraiah in Srikakulam. His wife, involved in an extramarital affair, plotted his murder with her lover.

వివాహేతర సంబంధం.. భర్తను హత్యచేసిన భార్య

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం బొబ్బిలిపేటలో వైసీపీ నేత చంద్రయ్య హత్య కేసులో పోలీసులు సంచలన విషయాలను బయటపెట్టారు. చంద్రయ్య భార్య ఈశ్వరమ్మ తన ప్రియుడు బాలమురళీ కృష్ణ సహాయంతో భర్తను హత్య చేయించినట్లు విచారణలో తేలింది. వివాహేతర సంబంధం భర్తకు తెలిసిపోవడంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. చివరకు, భర్తను అడ్డుగా భావించి అతడిని హత్య చేయాలని ఆమె ప్లాన్ వేసింది. హత్యకు ముందు బాలమురళీ కృష్ణ తన బంధువైన అరవింద్ సహాయంతో మరికొందరిని సంప్రదించాడు. ప్లాన్…

Read More
Elephant herds from Odisha's forests have caused crop damage and distress in Bhamini, prompting farmers to demand immediate compensation and safety measures.

భామినిలో ఏనుగుల బీభత్సం, పంట నష్టాలపై పరిహార డిమాండ్

2009వ సంవత్సరంలో ఒడిశాలోని లఖిరేఖల్ అడవుల నుండి వచ్చిన ఏనుగుల గుంపు ఆంధ్రప్రదేశ్‌లోని పాలకొండ నియోజకవర్గంలో పంటల నష్టాలను కలుగజేస్తూ 11 మంది ప్రాణాలను హరించింది. అప్పటి ప్రభుత్వాలు హడావుడిగా స్పందించినప్పటికీ, కాలగమనంలో ఇచ్చిన హామీలను పక్కన పెట్టారు. ప్రస్తుతం భామిని మండలంలో వంశధార నది పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపు పంటలపై తీవ్ర నష్టాలను కలిగిస్తోంది. గత వారం రోజులుగా భామినిలోని రైతులు పొలాల్లోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. వరి కుప్పలు, నూర్పు చేసిన ధాన్యం,…

Read More
Residents of Dolapeta village face severe challenges due to the lack of proper road connectivity, affecting access to emergency and healthcare services.

డోలపేట రోడ్డు సమస్యతో ప్రజలు అవస్థలు

ఎచ్చెర్ల మండలం డోలపేట గ్రామానికి అతి చిన్న రోడ్డు ఉండడంతో వాహనాల రాకపోకలు కు తీవ్ర అంతరాయం కలుగుతుంది. అయితే గ్రామానికి ద్విచక్ర వాహనాలు తప్ప ఇంకా ఏ వాహనాలు కూడా వెళ్ళలేని పరిస్థితి. అయితే గ్రామం నుండి రోగులకు సమీప మండలంలో గల పీహెచ్సీ (PHC)సెంటర్ కు లేదా ఏరియా ఆసుపత్రికి, శ్రీకాకుళం జిల్లా ప్రధాన ఆసుపత్రి కు తీసుకువెళ్ళాలి అంటే 108 అత్యవసర వాహనాలు కూడా వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. అయితే గ్రామనికి సరైన…

Read More
Srikakulam DSP led a rally raising awareness about the harmful effects of drugs, highlighting students' role in eradicating substance abuse

మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహణ

చదువుతోనే బంగారు భవిష్యత్ అని శ్రీకాకుళం డిఎస్పీ సి.హెచ్ వివేకానంద ఆదివారం అన్నారు. నగరంలోని ఎల్ఐసి కార్యాలయం ప్రక్కన ఉన్న కాకినాడ ఆదిత్య మహిళాడిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో డ్రగ్స్, టొబాకో వంటి మాదక ద్రవ్యాలు వలన కలిగే దృష్ప్రభావాలు కోసం అరసవిల్లి కూడలి నుండి సూర్యమహల్ వివేకానంద విగ్రహ కూడలి వరకు మాదక ద్రవ్యాలు పై వ్యతిరేక నినాదాలతో భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని డిఎస్పీ సి.హెచ్ వివేకానంద జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ…

Read More
CPM leaders demand the government stop installing smart meters and roll back the true-up charges, calling it a burden on the public. They held a protest at the Yedcherla Substation.

విద్యుత్ స్మార్ట్ మీటర్లు, ట్రూ అప్ చార్జీలపై సిపిఎం ధర్నా

ప్రజలు ఫై భారాలు మోపే విద్యుత్ ట్రూ అప్ చార్జీలు రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు బిగింపు ఆపాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి.తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ప్రజలపై విద్యుత్ భారాలు వేయవద్దని, విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగింపు ఆపాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో ఎచ్చెర్ల విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు,కార్మికులు, ప్రజల పాలిట ఉరితాళ్ళుగా మారనున్న విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగింపు ప్రక్రియను…

Read More