తాళం వేసి ఊరేళ్లిన ఇంట్లో భారీగా బంగారు, వెండి, నగదు దోచుకెళ్లిన దొంగలు.భాధితురాలు బచ్చల గంగ అనే మహిళలు ఫిర్యాదుతో అంతర్ జిల్లా దొంగల ముఠాను పట్టుకున్న పోలీసులు.నిండుతుల నుండి కార్,రెండు బైక్ లు, మూడు కాసుల బంగారం, రెండున్నర కిలోల వెండి అభరణాలు, 20వేలు నగదు స్వాధీనం చేసుకున్న రాజానగరం పోలీసులు.నిందితులు ఇద్దరు రాజమండ్రి రూరల్ ప్రాంతానికి చెందిన బండి ధర్మరాజు,వానపల్లి గౌరీ శంకర్ లు గా పోలీసుల తెలిపారు.నిందితులు చెడు వ్యాసనాలకు అలవాటు పడి తాళం వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్ గా చేసుకుని జిల్లా వ్యాప్తంగా దొంగతనాలకు పాల్పడినట్లు సీఐ ప్రసన్న వీరయ్య గౌడ్ మీడియా సమావేశంలో తెలిపారు.
నిందితులపై గోకవరం, కోరుకొండ, రాజానగరం, బొమ్మూరు పోలీస్ స్టేషన్లలో దొంగతనం కేసులు ఉన్నట్లు జిల్లా వ్యాప్తంగా ఒక్కొక్కరిపై 20 కేసులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.








