Saturday, July 4, 2026
Chat on WhatsApp
HomeInterNationalలండన్ వీధుల్లో భారత్ మాతా కీ జై నినాదాలు

లండన్ వీధుల్లో భారత్ మాతా కీ జై నినాదాలు

-

Chat on WhatsApp

లండన్ వీధులు ఆదివారం భారత్ మాతా కీ జై, ఇండియా జిందాబాద్ నినాదాలతో మార్మోగిపోయాయి. భారత హైకమిషన్ ఎదుట పాక్ సంతతికి చెందిన పౌరులు నిర్వహించిన నిరసన ప్రదర్శనను భారత మద్దతుదారులు సమర్థవంతంగా డామినేట్ చేశారు. మువ్వన్నెల జెండాలు రెపరెపలాడుతుండగా, భారతీయులు దేశభక్తి గీతాలు ఆలపించి గడ్డను హోరెత్తించారు.

పహల్గామ్ ఉగ్రదాడిపై భారత్ చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ పాక్ సంతతి పౌరులు భారత హైకమిషన్ ఎదుట నిరసన చేపట్టారు. సుమారు 50-60 మంది పాక్ జెండాలతో భారత్ వ్యతిరేక నినాదాలు చేశారు. అయితే, వందలాదిమంది భారత మద్దతుదారులు అక్కడికి చేరుకొని భారీ త్రివర్ణ పతాకంతో ప్రదర్శన నిర్వహించారు. “వందేమాతరం”, “జై శ్రీరామ్” నినాదాలతో వాతావరణం దేశభక్తి భావనలతో నిండిపోయింది.

పాక్ నిరసనకారులు ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేసినా, వారి సంఖ్య తగ్గిపోయి ఉత్సాహం మందగించింది. పహల్గామ్ ఘటనపై పాక్ నిరాకరణ వ్యక్తం చేసినా, అక్కడి భారత మద్దతుదారుల ఉత్సాహం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత పెరగకుండా ఉండేందుకు మెట్రోపాలిటన్ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.

ఈ సంఘటన బ్రిటన్ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. లండన్ వీధుల్లో విదేశీ దేశాల వివాదాలు చోటుచేసుకోవడంపై కొన్ని స్థానిక రాజకీయ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. బహుళ సాంస్కృతిక విధానంపై ప్రశ్నలు తలెత్తాయి. పరిస్థితిని శాంతియుతంగా కాపాడేందుకు పోలీసుల కృషి ప్రశంసలందుకుంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Indian Government | చిన్నారుల భద్రతపై కేంద్రం సీరియస్.. ఇన్‌స్టాగ్రామ్‌కు నోటీసులు జారీ

Indian Government: సోషల్ మీడియా దిగ్గజం ఇన్‌స్టాగ్రామ్‌కు కేంద్ర ప్రభుత్వం కీలక నోటీసులు జారీ చేసింది. చిన్నారుల భద్రతకు సంబంధించిన అంశాలను అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ...
- Advertisement -
Chat on WhatsApp