Thursday, March 5, 2026
No menu items!
Google search engine
HomeNationalAyodhya Temple: అయోధ్య రామ మందిరంలో చారిత్రక ఘట్టం...మోదీ చేతుల మీదుగా ధ్వజారోహణ

Ayodhya Temple: అయోధ్య రామ మందిరంలో చారిత్రక ఘట్టం…మోదీ చేతుల మీదుగా ధ్వజారోహణ

- Advertisement -
Google search engine

Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిర నిర్మాణ ప్రాజెక్ట్ చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో నేడు ఆలయ శిఖరంపై కాషాయ ధ్వజాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు. ఆలయ నిర్మాణ పనులు పూర్తయినందుకు గుర్తుగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి కార్యాలయం చారిత్రక ఘట్టంగా అభివర్ణించింది.

లంబకోణ త్రిభుజాకారంలో ఉన్న ఈ పవిత్ర ధ్వజం 10 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవుతో రూపుదిద్దుకుంది. ఇందులో సూర్య చిహ్నం, ఓం ప్రతీక, దేవ కాంచనం వృక్షాన్ని ప్రతిబింబించే బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇది సాంస్కృతిక వారసత్వం, ఐక్యత, రామరాజ్య విలువలకు ప్రతీకగా సూచించబడింది.

ALSO READ:Lakshmi Mittal UK exit | పన్నుల మార్పులతో దేశం విడిచిన బిలియనీర్ 

ధ్వజారోహణకు ముందు ప్రధాని మోదీ సప్తమందిర్ సముదాయంలోని వశిష్ఠ, విశ్వామిత్ర, వాల్మీకి, అగస్త్య, అహల్య, శబరి, నిషాద్‌రాజు గుహ ఆలయాలను సందర్శించనున్నారు. అనంతరం శేషావతార్ మందిరం, మాతా అన్నపూర్ణ, రామ దర్బార్ గర్భగృహాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమానికి మార్గశిర శుక్ల పక్ష పంచమి రోజు, అభిజిత్ లగ్నం ముహూర్తం నిర్ణయించబడింది. ఇదే సమయాన సీతారాముల కల్యాణం జరిగినట్లు పురాణాలలో పేర్కొనబడింది.

ఆలయ నిర్మాణంలో ఉత్తర, దక్షిణ భారత వాస్తు శైలుల మేళవింపు, రామాయణ ఘట్టాలపై చెక్కిన 87 రాతి శిల్పాలు ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకతలు. ప్రధాని పర్యటన నేపధ్యంలో అయోధ్యలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

YouTube thumbnailYouTube icon
- Advertisement -
Google search engine
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular