Sunday, July 12, 2026
Chat on WhatsApp
HomeTelanganaHyderabadలోకల్ ట్రైన్‌లో యువతిపై దాడి – రైలు నుంచి దూకి గాయాలు

లోకల్ ట్రైన్‌లో యువతిపై దాడి – రైలు నుంచి దూకి గాయాలు

-

Chat on WhatsApp

హైదరాబాద్‌లో లోకల్ ట్రైన్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒంటరిగా ప్రయాణిస్తున్న యువతిపై ఓ యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడే ప్రయత్నం చేశాడు. అతని నుంచి తప్పించుకోవడానికి బాధితురాలు రైలు నుంచి దూకి తీవ్ర గాయాలపాలైంది.

అనంతపురం జిల్లాకు చెందిన బాధితురాలు మేడ్చల్‌లోని ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. తన సెల్‌ఫోన్ రిపేర్ కోసం సికింద్రాబాద్ వెళ్లిన ఆమె తిరిగి లోకల్ ట్రైన్‌లో వెళ్తుండగా, మహిళా బోగీలో ఉన్న మరో ఇద్దరు మహిళలు అల్వాల్ స్టేషన్‌లో దిగిపోయారు. ఆ తర్వాత బోగీలో ఒంటరిగా ఉన్న ఆమెపై ఓ 25 ఏళ్ల యువకుడు దాడి చేయబోయాడు.

అతని నుంచి తప్పించుకోవడానికి బాధితురాలు కొంపల్లి సమీపంలో రైలు నుంచి దూకింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు నిందితుడిని గుర్తించే పనిలో ఉన్నారు. లోకల్ ట్రైన్‌లో భద్రతపై మరోసారి ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. రైలు ప్రయాణికుల భద్రతపై అధికారులు చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ins-mahendragiri-inducted-into-indian-navy-rajnath-singh

Rajnath Singh | సముద్రంలో భారత్‌కు తిరుగులేదు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన

Rajnath Singh: భారత సముద్ర భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళంలో కొత్తగా...
- Advertisement -
Chat on WhatsApp