ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను దాదాపు రూ.2.9 లక్షల కోట్లతో మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఈ సమావేశాలకు దూరంగా ఉండగా, ప్రభుత్వం బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలిపింది.
అసెంబ్లీ సమావేశాలు ఎంతకాలం కొనసాగించాలన్న విషయంపై బడ్జెట్ అనంతరం అసెంబ్లీ వ్యవహారాల కమిటీ చర్చించనుంది. సాధారణంగా 10 నుంచి 15 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశముంది. సమావేశాలలో బడ్జెట్తో పాటు ఇతర కీలక అంశాలపై చర్చ జరుగుతుంది.
ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ను మంత్రి అచ్చెన్నాయుడు శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో బడ్జెట్ను కొల్లు రవీంద్ర, వ్యవసాయ బడ్జెట్ను మంత్రి నారాయణ సమర్పిస్తారు.
