Friday, July 10, 2026
Chat on WhatsApp
HomeNationalజస్టిస్ సంజీవ్ ఖన్నా 51వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం

జస్టిస్ సంజీవ్ ఖన్నా 51వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం

-

Chat on WhatsApp

భారతదేశ 51 వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ఉదయం రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్ సంజీవ్ ఖన్నాతో ప్రమాణం చేయించారు. 2019 జనవరి నుంచి సుప్రీం కోర్టులో న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆర్టికల్ 370 సహా పలు కీలక కేసుల్లో తీర్పులిచ్చిన బెంచ్ లలో జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ఉన్నారు. వచ్చే ఏడాది మే 13 వరకు ఆయన సీజేఐగా బాధ్యతలు నిర్వహిస్తారు. కాగా, రాష్ట్రపతి భవన్ లో జరిగిన సీజేఐ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌, ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, కేంద్ర న్యాయశాఖమంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ తదితరులు హాజరయ్యారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

CM Revanth Reddy | ‘తాత.. నువ్వే పూరీలు వేయాలి’.. మనవడి కోరిక తీర్చిన...

CM Revanth Reddy: రాష్ట్ర పాలనలో నిత్యం బిజీగా ఉండే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈసారి కుటుంబంతో గడిపిన ఓ అపురూపమైన క్షణాన్ని ప్రజలతో పంచుకున్నారు. అధికారిక కార్యక్రమాలకు భిన్నంగా ఆయన...
- Advertisement -
Chat on WhatsApp