Wednesday, July 29, 2026
Chat on WhatsApp
HomeFilms Newsఅల్లుఅర్జున్ కు నాంపల్లి కోర్టు ఊరట, రెగ్యులర్ బెయిల్

అల్లుఅర్జున్ కు నాంపల్లి కోర్టు ఊరట, రెగ్యులర్ బెయిల్

-

Chat on WhatsApp

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు భారీ ఊరటను కల్పించింది. సంథ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ఆయనకు షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. కోర్టు రూ. 50 వేల రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. రిమాండ్ ముగిసిన అనంతరం కోర్టు విచారణకు అల్లు అర్జున్ వర్చువల్ గా హాజరయ్యారు.

అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు రెగ్యులర్ బెయిల్ మంజూరుచేయాలని కోర్టుకు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై కోర్టు విచారణ జరిపి ఈ రోజు అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ తీర్పు అనంతరం ఆయన కుటుంబ సభ్యులు మరియు అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

కానీ, బెయిల్ మంజూరు సందర్భంగా కోర్టు అల్లు అర్జున్ కు పలు షరతులు విధించింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో హాజరుకావాలని ఆదేశించింది. అలాగే, ఈ కేసులో సాక్షులను ప్రభావితం చేయరాదని కోర్టు స్పష్టం చేసింది.

ఈ మేరకు అల్లు అర్జున్ తరపు న్యాయవాది అశోక్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఈ నిర్ణయం తరువాత, అల్లు అర్జున్ తన సామాన్య జీవితంలో మరింత మనశ్శాంతిని పొందినట్లుగా అనిపిస్తోంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Burj Khalifa Introduces UPI Ticket Booking for Indian Tourists

Burj Khalifa | బుర్జ్ ఖలీఫా సందర్శన ఇక మరింత సులభం.. UPIతో ఆన్‌లైన్...

Burj Khalifa: దుబాయ్‌లోని ప్రపంచ ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫా సందర్శించాలనుకునే భారతీయ పర్యాటకులకు గుడ్‌న్యూస్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా సందర్శన కోసం ఇప్పుడు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)...
- Advertisement -
Chat on WhatsApp