Sunday, February 22, 2026
No menu items!
spot_img
HomeRangareddyMaheswaramAITUC రాష్ట్ర కౌన్సిల్ సమావేశం

AITUC రాష్ట్ర కౌన్సిల్ సమావేశం

మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ లో ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో AITUC రాష్ట్ర కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం బి. దత్తు నాయక్ ఆధ్వర్యంలో జరిగింది.

ఈ సందర్భంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి సెమినార్ “మన ఆర్థిక లాభాల కోసమా ప్రజల కోసమా” అనే అంశంపై జరిగిన సెమినార్‌లో మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ, AITUC కార్మిక సంఘం పెట్టుబడిదారీ లాభాలను వ్యతిరేకించడం లేదని తెలిపారు.

ప్రారంభంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ, ఆర్థిక అభివృద్ధి సాధించడానికి కార్మికుల కొనుగోలు శక్తిని పెంచాలని ప్రభుత్వాలను కోరారు.

భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందాలంటే ఉత్పత్తి శక్తులకు ఆదాయాన్ని పెంచాలని ఆయన నొక్కిచెప్పారు.

ఉత్పత్తులను పెంచడం ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధించడం అసాధ్యం అని ఆయన తెలిపారు.

ప్రజల దగ్గర కార్మికుల దగ్గర కొనుగోలు శక్తి లేకపోతే పారిశ్రామిక ఉత్పత్తులను ఎవరు కొనుగోలు చేస్తారని ఆయన ప్రశ్నించారు.

ఈ సమావేశానికి AITUC రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు మరియు ఇతర సంబంధిత వ్యక్తులు పాల్గొన్నారు.

సమావేశం ఉత్పత్తి, కొనుగోలు శక్తి పెంచడం ద్వారా ఆర్థిక అభివృద్ధికి కీలకమైన అంశాలను విశ్లేషించడంపై ఫోకస్ చేసింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular