Thursday, July 9, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshమదనపల్లిలో రెవెన్యూ అధికారులపై దాడిని ఏఐటీయూసీ ఖండింపు

మదనపల్లిలో రెవెన్యూ అధికారులపై దాడిని ఏఐటీయూసీ ఖండింపు

-

Chat on WhatsApp

మదనపల్లి రూరల్ తట్టివారిపల్లి పంచాయతీలో అక్రమ భవన నిర్మాణాలను అడ్డుకునేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులపై భూ ఆక్రమణదారులు దాడి చేసిన ఘటనను ఏఐటీయూసీ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. రెవెన్యూ అధికారులపై దాడి చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

మదనపల్లి పట్టణం, పరిసర ప్రాంతాల్లో గుట్టలు, వాగులు, వంకలు రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా అక్రమ నిర్మాణాలకు గురవుతున్నాయని ఆయన ఆరోపించారు. అవినీతి అధికారుల మౌన సమ్మతి వల్లనే ప్రభుత్వ భూముల ఆక్రమణ నిరవధికంగా కొనసాగుతోందని తెలిపారు. ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమించి భవనాలు నిర్మించేవరకు కింది స్థాయి రెవెన్యూ అధికారులు ఎందుకు స్పందించరని ఆయన ప్రశ్నించారు.

సాధారణ రైతులకు 1బి, ప్రొణం రికార్డుల కోసం అనేక ఇబ్బందులు కలిగించే రెవెన్యూ అధికారులు, విలువైన ప్రభుత్వ భూముల ఆక్రమణ విషయంలో మాత్రం ఎందుకు లెక్కచేయరని సాంబశివ మండిపడ్డారు. లక్షల రూపాయల విలువైన భూములను ఆక్రమించేవారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

పోలీసులు భూ ఆక్రమణదారులను హెచ్చరిస్తున్నప్పటికీ, కబ్జాలు కొనసాగుతున్నాయని, రెవెన్యూ అధికారులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఏఐటీయూసీ కోరింది. విలువైన ప్రభుత్వ భూములను భవిష్యత్తు అవసరాలకు కాపాడాలని, అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేసింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

cobra blocks traffic on palace road in bengaluru viral video

Cobra Blocks Traffic | బెంగళూరు ట్రాఫిక్‌ను ఆపగలిగింది చివరకు ఒక కోబ్రానే..!

బెంగళూరులో ట్రాఫిక్ సమస్యలు సాధారణమే. అయితే ఈసారి ట్రాఫిక్‌కు కారణమైనది వాహనాల రద్దీ కాదు.. ఓ భారీ తాచుపాము. నగరంలోని ప్యాలెస్ రోడ్డులో చోటుచేసుకున్న ఈ ఘటన అక్కడి వాహనదారులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా...
- Advertisement -
Chat on WhatsApp